మానవ గౌరవంపై ధ్యానాంశాన్ని అందించిన పోప్ లియో
బుధవారం సెప్టెంబర్ 9 న జరిగిన సాధారణ ప్రేక్షకుల సమావేశంలో పోప్ లియో రెండవ వాటికన్ మహాసభకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలపై తన బోధనలను చేసారు,
ఈ వారం కూడా గౌదియుమ్ ఎట్ స్పెస్ (Gaudium et Spes) అనే పత్రంపై తన ధ్యానాన్ని కొనసాగిస్తూ ప్రత్యేకంగా మానవ వ్యక్తి గౌరవం గురించి ద్యానిందాం అని పోప్ అన్నారు
మానవ గౌరవం అనేది ఒక వ్యక్తి వద్ద ఉన్న సంపద, అతను చేసే పని లేదా అతను సాధించిన విజయాలపై ఆధారపడి ఉండదు.
అది ప్రతి మనిషి సహజమైన స్వభావం నుంచే వస్తుంది. ఎందుకంటే మనిషి దేవుని రూపంలో, ఆయన పోలికలో సృష్టించబడినవాడు.
ఈ గౌరవాన్ని వ్యక్తపరిచే మూడు ముఖ్యమైన వరాలను మనం కలిగి ఉన్నాము అవి
మొదటిది సత్యాన్ని అన్వేషించే జ్ఞానశక్తి, రెండవది దేవుని పిలుపును గుర్తించే మనస్సాక్షి,మూడవది మంచిని ఎంచుకునే స్వేచ్ఛ.
అయితే, మనిషి నిజమైన వ్యక్తిత్వాన్ని మరియు అతని గౌరవాన్ని మనం **క్రీస్తులోనే సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాము.**
ఎందుకంటే మన వ్యక్తిత్వం అనేది ఇతరులతో సంబంధంలో జీవించడానికి, అలాగే దేవునికి మరియు ఇతరులకు మనల్ని మనం ప్రేమతో ఒక కానుకగా సమర్పించుకోవడానికి ఇచ్చిన పిలుపును కలిగి ఉంది.
కాబట్టి, దేవుడు మనకు ప్రసాదించిన ఈ గౌరవాన్ని ఒకరినొకరం కాపాడుకోవడానికి, పరిరక్షించడానికి, సమర్థించడానికి** మనం సహాయపడుదాం అని పోప్ అన్నారు
