రోమ్‌కు చెందిన పేదలతో విందారగించనున్న పోప్ లియో

జూలై 11, శనివారం నాడు, కాస్టెల్ గాండోల్ఫోలోని పాంటిఫికల్ గార్డెన్స్‌లో ఉన్న 'బోర్గో లౌడాటో సి'లో పోప్ లియో సుమారు 200 మంది పేదలతో మధ్యాహ్న భోజనం చేయనున్నారు.

'లంచ్ విత్ ది పోప్' అని పిలువబడే ఈ కార్యక్రమం, 'సృష్టి సంరక్షణ ఆరాధన క్రమం' (లిటర్జీ ఫర్ ది కేర్ ఆఫ్ క్రియేషన్)ను ఉపయోగించి దివ్యబలిపూజతో ప్రారంభమవుతుంది. 

అనంతరం స్వాగత కార్యక్రమం, అల్పాహారం, 'బోర్గో లౌడాటో సి'లో గైడెడ్ మార్గదర్శకతతో సందర్శన జరగనున్నవి.

ఆగష్టు 2025లో పోప్ లియో ఇటలీలోని అల్బానో మేత్రాసనానికి చెందిన పేదలతో కలిసి మధ్యాహ్న భోజనం చేసినప్పుడు ప్రారంభించిన ఒక కార్యక్రమానికి కొనసాగింపుగా ఇది జరుగుతోంది.

అప్పటి నుండి ఆ సమావేశం, 'లౌడాటో సి' సెంటర్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్' ద్వారా ప్రోత్సహించబడే ఒక వార్షిక కార్యక్రమంగా మారింది. 

ఈ సెంటర్ ను 'బోర్గో లౌడాటో సి' ప్రాజెక్ట్ అభివృద్ధిని పర్యవేక్షిస్తుంది.

ప్రతి సంవత్సరం, పేద ప్రజలు, శరణార్థులు, వలసదారులు మరియు కష్టాలను ఎదుర్కొంటున్న ఇతరులను ఒకచోట చేర్చడానికి వివిధ మేత్రాసనాలను ఆహ్వానిస్తారు. 

ఈ సంవత్సరం కార్యక్రమాన్ని లాడటో సి' ఉన్నత విద్యా కేంద్రం, దాతృత్వ సేవా విభాగం  మరియు రోమ్ మేత్రాసన సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 

రోమ్ మేత్రాసన వికార్ జనరల్ కార్డినల్ బల్దాస్సారే రీనా, ఆహ్వానించబడిన వారు నగరవ్యాప్తంగా ఉన్న విచారణలు , కారితాస్ మరియు అనేక చర్చి, సామాజిక సంస్థలచే ప్రతిరోజూ సహాయం అందుకునే వ్యక్తులని వివరించారు.

సృష్టి పట్ల శ్రద్ధ, మానవ అభివృద్ధి మరియు క్రైస్తవ నిర్మాణం అనేవి భాగస్వామ్యం మరియు విశ్వాసం వంటి ప్రత్యక్ష అనుభవాల ద్వారా ఏకమయ్యే 'బోర్గో లౌడాటో సి' యొక్క లక్ష్యాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని నిర్వాహకులు తెలిపారు.