పెరూ: 'సోడాలిటియం బాధితుల ముందు మోకరిల్లిన కార్డినల్స్, బిషప్లు
పెరూ: 'సోడాలిటియం బాధితుల ముందు మోకరిల్లిన కార్డినల్స్, బిషప్లు
పెరూలో 'సోడాలిటియం క్రిస్టియానె విటే' (SCV) అనే క్యాథలిక్ లే మూవ్మెంట్ ద్వారా భూములు కోల్పోయిన మరియు లైంగిక, ఆధ్యాత్మిక వేధింపులకు గురైన బాధితుల ముందు ఆ దేశ కార్డినల్స్, బిషప్లు మోకరిల్లి బహిరంగంగా క్షమాపణలు కోరారు.పెరూలో జరిగిన ఈ కార్యక్రమం,పెరూలోని కటాకావోస్ (Catacaos) ప్రాంతంలో టాలన్ కమ్యూనిటీకి చెందిన ఆదివాసీ ప్రజల సమక్షంలో జరిగింది.
క్యాథలిక్ గ్రూపుకు చెందిన కంపెనీలు కటాకావోస్ ప్రాంతంలో వేలాది హెక్టార్ల స్థానిక భూములను ఆక్రమించుకొని, గిరిజనులను ఖాళీ చేయించడం వల్ల అక్కడ తీవ్ర అశాంతి నెలకొంది.
సోడాలిటియం వ్యవస్థాపకుడు లూయిస్ ఫెర్నాండో ఫిగారి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలింది . దీనితో పాటు నాయకుల ఆర్థిక దుర్వినియోగం మరియు అగ్ర సభ్యుల ఆధ్యాత్మిక దుర్వినియోగాలను వెలికితీసిన వాటికన్ దర్యాప్తు మరియు సంవత్సరాల సంస్కరణ ప్రయత్నాల తర్వాత, దివంగత పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు 2025లో రద్దు చేశారు.
2011లో, దాని వ్యవస్థాపకుడైన లూయిస్ ఫిగారి చేసిన దురాగతాల గురించి మాజీ సభ్యులు పెరూ రాజధాని లిమాలోని ఆర్చ్డయోసిస్కు ఫిర్యాదు చేశారు. కానీ 2015లో బాధితుల్లో ఒకరు, ఒక జర్నలిస్ట్ కలిసి ఒక పుస్తకం రాసేంత వరకు స్థానిక అధికారులు గానీ , హోలీ సీ గానీ ఎటువంటి నిర్దిష్ట చర్యలు తీసుకోలేదు.
వాటికన్ ప్రతినిధులుగా హాజరైన అగ్రపీఠాధిపతులు మహాపూజ్య చార్లెస్ స్కిక్లూనా, మోన్సిగ్నోర్ జోర్డి బెర్టోమియులతో పాటు పెరూవియన్ బిషప్లు స్వయంగా మోకరిల్లి, దశాబ్దాలుగా ఎదురైన అన్యాయాలకు క్షమాపణలు చెప్పారు. సోడాలిటియం మూవ్మెంట్ ద్వారా వేధింపులకు గురైన బాధితులకు మరియు భూములు కోల్పోయిన స్థానిక 'టల్లన్' (Tallán) గిరిజనులకు ఈ వేడుకలో సంఘీభావం ప్రకటించారు.
Article and Design By M Kranthi Swaroop