పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని కలిసిన మడగాస్కర్ అధ్యక్షుడు

మడగాస్కర్ అధ్యక్షుడు

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని కలిసిన మడగాస్కర్ అధ్యక్షుడు

ఫ్రాన్సిస్ పాపు గారు ఆగస్ట్ 17న మడగాస్కర్ కథోలిక అధ్యక్షుడు ఆండ్రీ నిరినా రాజోలీనాను అతని భార్య మియాలీ రజాకండిసా, అతని కుమారులు అరీనా మరియు ఇలోన్‌స్టోవా మరియు ఒక కుమార్తె ఇలోనాలను  కలిశారు.

జనవరి 2019 నుండి మడగాస్కర్ ప్రస్తుత అధ్యక్షుడిగా, ఆయన 2009 నుండి 2014 వరకు దేశ తాత్కాలిక నాయకుడిగా కూడా పనిచేశారు.

20 నిమిషాల ప్రైవేట్ సంభాషణలో,ఫ్రాన్సిస్ పాపు గారు మడగాస్కర్ పీఠాధిపతులు తనకు ఇచ్చిన మరియమాత స్వరూపం ముందు కలిసి మంగళవార్త జపమును ప్రార్థించమని రాజోలీనా కుటుంబాన్ని ఆహ్వానించారు.

ఫ్రాన్సిస్ పాపు గారు 2019 ద్వీప దేశ పర్యటన సందర్భంగా  మరియు ప్రతినిధి బృందం పక్కన ఒక చిన్న ఓడ కూడా ప్రదర్శించబడింది.

సెప్టెంబర్ 6–8, 2019 వరకు మొజాంబిక్ మరియు మారిషస్ పర్యటనలో ఫ్రాన్సిస్ పాపు గారు  సందర్శించిన దేశాలలో మడగాస్కర్ ఒకటి.

మడగాస్కర్ 22 కథోలిక మేత్రాసనాలతో తూర్పు ఆఫ్రికా తీరానికి 250 మైళ్ల దూరంలో ఉన్న ఒక ద్వీప దేశం.

మడగాస్కర్ జనాభాలో 40% నుండి  80%  క్రైస్తవులు, ప్రొటెస్టంట్లు మరియు కథోలికులు అని అంచనా వేయబడింది. దేశంలో మొత్తం 25 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు మరియు ఇస్లాం మరియు దేశీయ మతాలు కూడా ఆచరించబడుతున్నాయి.

రాజోలీనా ఫ్రాన్సిస్‌ పాపు గారి తో సమావేశమైన తర్వాత వాటికన్ దౌత్యవేత్త మరియు రాష్ట్రాలతో సంబంధాల సెక్రటరీ అయిన మోన్సిగ్నర్ మిరోస్లావ్ స్టానిస్లావ్ వాచోస్కీతో మాట్లాడారు.

సంభాషణ సమయంలో, వాటికన్ ఉక్రెయిన్‌లో యుద్ధం మరియు దాని ప్రపంచ ప్రభావం, ఆఫ్రికన్ సంక్షోభాలు మరియు మలగసీ సమాజంలో కథోలిక శ్రీసభ పాత్ర గురించి క్లుప్తంగా వివరించబడింది.

అదనంగా, వాటికన్ మరియు మడగాస్కర్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందాన్ని రూపొందించే అవకాశాలపై ఇద్దరూ చర్చించారు.