క్రైస్తవ గుర్తింపును తిరిగి పొందిన ఇరాకీ మహిళ.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

ఇరాక్‌లో తన క్రైస్తవ మత గుర్తింపును ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో తిరిగి నమోదు చేయించుకునేందుకు న్యాయపోరాటం చేసిన ఓ యువతికి తుది విజయం లభించింది.

క్రైస్తవ గుర్తింపును తిరిగి పొందిన ఇరాకీ మహిళ.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

ఇరాక్‌లో తన క్రైస్తవ మత గుర్తింపును ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో తిరిగి నమోదు చేయించుకునేందుకు న్యాయపోరాటం చేసిన ఓ యువతికి తుది విజయం లభించింది. ఇరాక్‌లోని అత్యున్నత అప్పీల్ న్యాయస్థానమైన కోర్ట్ ఆఫ్ కాసేషన్ ఆమె మత గుర్తింపును ‘ముస్లిం’ నుంచి ‘క్రైస్తవoగా మార్చేందుకు అనుమతించిన దిగువ కోర్టు తీర్పును సమర్థించింది. 

మర్యమ్’ అనే మారుపేరుతో గుర్తించబడిన ఈ మహిళ క్రైస్తవ కుటుంబంలో పెరిగారు. అయితే ఆమె తల్లి ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత, ఇరాక్‌లోని నేషనల్ కార్డ్ చట్టంలోని ఆర్టికల్ 26(2) ప్రకారం, మైనర్ పిల్లల మతాన్ని తల్లిదండ్రుల్లో ఇస్లాంలోకి మారిన వ్యక్తి మతంగా నమోదు చేసే నిబంధన కారణంగా ఆమెను కూడా ప్రభుత్వ రికార్డుల్లో ముస్లింగా నమోదు చేశారు.

చట్టబద్ధమైన వయస్సుకు చేరుకున్న తర్వాత, తన విశ్వాసానికి అనుగుణంగా అధికారిక రికార్డుల్లో మత గుర్తింపును సరిచేయాలని కోరుతూ మర్యమ్ జనవరి 2025లో న్యాయపోరాటాన్ని ప్రారంభించారు. 2026 మేలో దిగువ కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అనంతరం ఈ కేసు ఇరాక్ కోర్ట్ ఆఫ్ కాసేషన్‌కు వెళ్లగా, జూలై 2026లో ఆ కోర్టు కూడా ఆమెకు అనుకూలంగా తుది తీర్పు ఇచ్చింది. 

ఇరాక్‌లో మత స్వేచ్ఛ, వ్యక్తిగత మత గుర్తింపుపై కొనసాగుతున్న చర్చకు ఈ తీర్పు ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు.

 

Article and Design By M Kranthi Swaroop

Telugu Survey Popup Image