ఓ అరుదైన జ్ఞాపకం”

RVA త్రీ సెయింట్స్ ఛాపెల్‌ (RVA Three Saints Chapel)

“మదర్ థెరిసా: రేడియో వెరితాస్ ఆసియా లో ఓ అరుదైన జ్ఞాపకం” 

ఈ రోజు మనం సెయింట్ మదర్ థెరిసాను స్మరించుకుంటున్న సందర్భంగా, ఆమె ఒకప్పుడు మనీలాలోని రేడియో వెరితాస్ ఆసియాను  సందర్శించారని మీకు తెలుసా??

ఈనాటికీ రేడియో వెరితాస్ ఆసియా (RVA) మదర్ థెరిసా జ్ఞాపకాలను ఎంతో గౌరవంగా పదిలపరుచుకుంటోంది. ఆమెను RVA త్రీ సెయింట్స్ ఛాపెల్‌కు పోషకులలో ఒకరిగా చేసింది. 

RVA త్రీ సెయింట్స్ ఛాపెల్‌ (RVA Three Saints Chapel) అనేది ఫిలిప్పీన్స్, మెట్రో మనీలాలోని క్యూజోన్ సిటీలో ఉన్న రేడియో వెరితాస్ ఆసియా (Radio Veritas Asia - RVA) ప్రధాన కార్యాలయంలోని ఒక పవిత్రమైన ప్రార్థనా మందిరం. ఈ ప్రార్థన మందిరం  కాథలిక్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ముగ్గురు సెయింట్స్ (పునీతులు)అయినా "సెయింట్  పొప్ పాల్ VI (Pope Paul VI), సెయింట్ జాన్ పాల్ II (Pope John Paul II),సెయింట్ మదర్ థెరిసా (Mother Teresa)" ల  జ్ఞాపకార్థం మరియు వారి గౌరవార్థం అంకితం చేయబడింది.

 ఈ ముగ్గురు పునీతులు గతంలో రేడియో వెరితాస్ ఆసియా (RVA) కేంద్ర కార్యాలయాన్ని స్వయంగా సందర్శించి, ఆశీర్వదించారు. వారి పవిత్ర అవశేషాలను (Relics) కూడా ఈ ఛాపెల్ గోడలలో భద్రపరిచారు. 

సెయింట్ పొప్ పాల్ VI, గారు  1970లో ఫిలిప్పీన్స్ సందర్శించినప్పుడు రేడియో వెరితాస్ కేంద్రాన్ని ప్రారంభించారు.సెయింట్ జాన్ పాల్ II, గారు  1981 మరియు 1995 (ప్రపంచ యువజన దినోత్సవం) లో RVAని సందర్శించారు. ఆయన రక్తపు మరక ఉన్న వస్త్రం (Blood Relic) ఇక్కడ భద్రపరచబడింది. 

సెయింట్ మదర్ థెరిసా గారు RVA స్టూడియోలను సందర్శించి ప్రసంగించారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా, ఎంతో సరళంగా జరిగిన ఆ సందర్శన వెనుక ఒక అద్భుతమైన జ్ఞాపకం ఉంది.ప్రపంచవ్యాప్తంగా పేదలు, అనాథలు, నిరాశ్రయులు, బాధితుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆమె… తన మాటల ద్వారా, తన సాన్నిధ్యం ద్వారా ఎంతోమందికి ఆశను అందించారు.

RVA త్రీ సెయింట్స్ ప్రార్థనా మందిరం ఇప్పుడు రేడియో వెరితాస్ ఆసియాకు ఆధ్యాత్మిక కేంద్రంగా, విశ్వాసానికి, మిషన్‌కు మరియు విశ్వ చర్చితో సహవాసానికి శాశ్వత చిహ్నంగా నిలుస్తుంది. క్వెజోన్ సిటీలోని పునరుద్ధరించబడిన RVAప్రార్థనా మందిరాన్ని ఏప్రిల్ 12, 2026న త్రీ సెయింట్స్ ఛాపెల్‌గా అంకితం చేశారు. 

Article and Design By M Kranthi Swaroop
 

 

Telugu Survey Popup Image