ప్రపంచ ప్రఖ్యాత రచయితలతో సమావేశమైన పోప్ లియో
పదకొండవ పోప్ పియస్ చే స్థాపించబడిన "వాటికన్ పబ్లిషింగ్ హౌస్" వాటికన్ గ్రంథాలను మరియు హోలీ సీ అధికారిక పుస్తకాలు, పత్రాలను ప్రచురిస్తుంది.
ఈ సంవత్సరం ఇది 100వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రపంచ నలుమూలల నుండి రచయితలు పోప్ను కలిశారు. పోప్ వారి రచనలను ప్రశంసించారు.
మీకు తెలిసినట్లుగా, రచన అనేది సత్యానికి, దైవ ప్రకటనకు సంబంధించిన క్రియ ఎందుకంటే అది మనం వ్యక్తిత్వాన్ని, మనం దేనిని నమ్ముతామో మరియు దేనిని ఆశిస్తామో వెల్లడిస్తుంది అని పోప్ లియో అన్నారు.
చివరగా, రచన దేవునికి సంబంధించినదని,ఇది ఒక సాహసోపేతమైన వాదనగా అనిపించవచ్చు, కానీ అనేక మంది వేదాంతవేత్తలు రచన కళకు మరియు బైబిల్లోని దేవుని ప్రత్యక్షతకు మధ్య ఉన్న సామరస్యం గురించి ఆలోచించి, వ్రాశారు.
మనం మన మానవ స్వభావం పరిశీలించుకుంటె ,ఆ దేవునికి దూరంగా లేము. మన ప్రతీ కథలో, దేవుడు తనను తాను వెల్లడి చేసుకుంటాడు.
అత్యంత సుపరిచితమైన వారిలో నార్వేకు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత Jon Fosse, పలువురు Pulitzer బహుమతి విజేతలు మరియు స్పానిష్ నవలా రచయిత్రి Julia Navarro ఉన్నారు