“ఎలాంటి పరిస్థితుల్లోనూ యేసు మనలను విడిచిపెట్టడు” - పోప్ లియో
“ఎలాంటి పరిస్థితుల్లోనూ యేసు మనలను విడిచిపెట్టడు” - పోప్ లియో
ఆదివారం సెయింట్ పీటర్ స్క్వేర్లో గుమిగూడిన యాత్రికులు, విశ్వాసులను ఉద్దేశించి పరిశుద్ధ లియో XIV పాపు గారు మాట్లాడుతూ, జీవితంలో ఎలాంటి కష్టాలు, చీకటి పరిస్థితులు ఎదురైనా మన ప్రభువైన యేసు క్రీస్తు వారు తన ప్రజలను ఎప్పటికీ విడిచిపెట్టడని స్పష్టం చేశారు.
ఆ రోజు చదివిన సువార్తలోని యేసుప్రభువు నీటిపై నడుస్తూ తన శిష్యుల దగ్గరకు వచ్చిన సంఘటనను ఆయన వివరించారు. తుఫాను చూసి శిష్యులు భయపడుతున్న సమయంలో యేసు వారికీ దైర్యం చెప్పారని గుర్తుచేశారు.
అదేవిధంగా, మన జీవితంలో ఎన్ని కష్టాలు, భయాలు, సమస్యలు ఎదురైనా యేసుపై మన దృష్టిని నిలిపితే భయపడాల్సిన అవసరం లేదు అని , కష్టాలపై కాకుండా యేసుపై విశ్వాసం ఉంచాలని ఈ సువార్త మనకు గుర్తుచేస్తుందని పరిశుద్ధ లియో XIV పాపు గారు చెప్పారు.
మన జీవితమనే పడవలోకి యేసును విశ్వాసంతో ఆహ్వానించినప్పుడు, కష్టాల మధ్య కూడా శాంతి, వెలుగు, ధైర్యం మరియు బలాన్ని పొందగలమని పరిశుద్ధ లియో XIV పాపు గారు వివరించారు.
ప్రార్థన, పవిత్ర సంస్కారాలు మరియు దేవుని వాక్యాన్ని ఆలకించడం ద్వారా క్రీస్తుతో మన సంబంధాన్ని మరింత బలపరచుకోవాలని పరిశుద్ధ లియో XIV పాపు గారు పిలుపునిచ్చారు.
Article and Design By M Kranthi Swaroop
