కాథలిక్ ఎక్స్‌టెన్షన్ సొసైటీని పోప్ ప్రశంసించిన పోప్

సోమవారం మే 18 నాడు, పోప్ లియో కాథలిక్ ఎక్స్‌టెన్షన్ సొసైటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులను మరియు వారి కుటుంబాలను కలిశారు.

పెంతెకోస్తు పండుగకు ముందు వాటికన్‌లో వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ యాత్ర వారి ప్రార్థనను మరింత బలపరచి, క్రీస్తుతో మరియు విశ్వ శ్రీసభతో వారి సహవాసాన్ని బలపరుస్తుందని తాను ఆశిస్తున్నట్లు పోప్ తెలిపారు.

అపొస్తలుల కార్యములను గూర్చి ధ్యానిస్తూ, పరిశుద్ధాత్మచే బలపరచబడిన శిష్యులు, సౌభ్రాతృత్వం, ప్రార్థన మరియు దివ్య సత్ప్రసాదంలో పాతుకుపోయిన సంఘాలను ఏర్పరుస్తూ, "ఆకాశం క్రింద ఉన్న ప్రతి జాతికి" క్రీస్తును ఎలా ప్రకటించడం ప్రారంభించారో పోప్ లియో గుర్తుచేసుకున్నారు.

120 సంవత్సరాల క్రితం, ఫాదర్ ఫ్రాన్సిస్ క్లెమెంట్ కెల్లీ కూడా ఇదే మిషనరీ స్ఫూర్తితో, యునైటెడ్ స్టేట్స్ అంతటా ఉన్న ఏకాంత విశ్వాస సంఘాలకు దివ్య సంస్కారాలను మరియు విస్తృత కతోలిక  మద్దతును తీసుకురావడానికి ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు.

"ఆ మిషనరీ ఉత్సాహం ఈనాటికీ అవసరం," అని పోప్ లియో అన్నారు. 

అమెరికాలోనూ, విదేశాలలోనూ ఉన్న పేద కతోలిక  వర్గాల పట్ల సొసైటీ చూపుతున్న నిరంతర నిబద్ధతకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఆ తర్వాత పోప్, క్యూబా మరియు ప్యూర్టో రికోలలో ఈ సంస్థ చేస్తున్న సేవను ప్రత్యేకంగా ప్రశంసించారు. 

అప్పటి డైలెక్సీ టే మాటలను ఉటంకిస్తూ, "మన పొరుగువారిపై మనకున్న ప్రేమ, దేవునిపై మనకున్న ప్రేమ యొక్క ప్రామాణికతకు స్పష్టమైన నిదర్శనం" అని పోప్ లియో అక్కడున్న వారికి గుర్తు చేశారు.

అమెరికాలోని నిరుపేద ప్రజలకు మరియు వలస కుటుంబాలకు సొసైటీ అందిస్తున్న సహాయాన్ని కూడా ఆయన ప్రోత్సహించారు.