FABC ప్లీనరీ సమావేశానికి ఆసియా కతోలిక నాయకులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న ఇండోనేషియా
2026 జూలై 20 నుంచి 26 వరకు ఇండోనేషియాలోని జకార్తాలో జరగనున్న Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశానికి ఆసియా నలుమూలల నుంచి విచ్చేయనున్న కతోలిక నాయకులకు ఘన స్వాగతం పలికేందుకు ఇండోనేషియా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
వారం రోజులపాటు కొనసాగే ఈ సమావేశం సజావుగా నిర్వహించడమే కాకుండా, ప్రతినిధులు ఇండోనేషియాకు చేరుకున్న క్షణం నుంచి తిరుగు ప్రయాణం చేసే వరకు వారికి సురక్షితమైన, సౌకర్యవంతమైన, ఆత్మీయమైన అనుభూతిని కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
ఇండోనేషియా మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, జూలై 7న మత వ్యవహారాల మంత్రి నసరుద్దీన్ ఉమర్ అధ్యక్షతన జరిగిన అంతర్శాఖల సమన్వయ సమావేశంలో, ప్రతినిధుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.
"వీరు మత నాయకులు. కాబట్టి ఇండోనేషియాలో ఉన్నంతకాలం వారు ప్రశాంతతను, ఆత్మీయతను అనుభవించేలా చూడాలని మేము కోరుకుంటున్నాం," అని మంత్రి నసరుద్దీన్ ఉమర్ తెలిపారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖల ప్రతినిధులు, స్థానిక నిర్వహణ సమాఖ్య సభ్యులు పాల్గొని, భద్రత, రవాణా, ప్రజా సమాచార వ్యవస్థలు తదితర పరిపాలనా ఏర్పాట్లపై సమన్వయం సాధించారు.
ఆతిథ్య నాణ్యత ఇండోనేషియా ఆతిథ్య దేశంగా పోషిస్తున్న బాధ్యతకు ప్రతిబింబమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. విభిన్న దేశాలు, సంస్కృతుల నుంచి ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో, వారి ఆహారపు అలవాట్లు, సాంస్కృతిక సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి అంశాన్ని నిర్వాహకులు జాగ్రత్తగా సిద్ధం చేస్తున్నారు.
ఈ ఏర్పాట్లలో జకార్తా ప్రాంతీయ ప్రభుత్వం, ఇండోనేషియా జాతీయ పోలీసు విభాగం, జాతీయ సాయుధ దళాలు, ఇమ్మిగ్రేషన్ డైరెక్టరేట్ జనరల్, ఇస్తిక్లాల్ మసీదు యాజమాన్యం, జకార్తా అగ్రపీఠం, అలాగే ప్రభుత్వ ప్రసార సంస్థలు పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయి.
జూలై 26న జకార్తా బృహద్దేవాలయంలో ముగింపు దివ్యబలి అనంతరం, ప్రతినిధులు "టన్నెల్ అఫ్ ఫ్రెండ్షిప్" (Tunnel of Friendship) గుండా ఇస్తిక్లాల్ మసీదును సందర్శించనున్నారు. అదే రోజు జకార్తాలో ప్రతి వారం నిర్వహించే కార్-ఫ్రీ డే కూడా ఉండటంతో, రవాణా, ప్రజల రద్దీ నియంత్రణ వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రతినిధులను చిన్న చిన్న బృందాలుగా సొరంగం గుండా తీసుకువెళుతూ, అంతర్మత సంభాషణ, సౌభ్రాతృత్వం, శాంతియుత సహజీవనానికి ప్రతీకగా నిలిచిన ఈ టన్నెల్ అఫ్ ఫ్రెండ్షిప్ చరిత్ర, ప్రాధాన్యాన్ని వారికి వివరించనున్నారు.
శారీరకంగా ప్రత్యేక సహాయం అవసరమైన ప్రతినిధుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వీల్చైర్లు లేదా ఇతర సహాయక సదుపాయాలు అవసరమైన వారిని ముందుగానే గుర్తించి, సమాఖ్య ప్రారంభానికి ముందే అన్ని సేవలు సిద్ధంగా ఉంచాలని నిర్వాహకులకు సూచించారు.
2026 జూలై 20 నుంచి 26 వరకు ఇండోనేషియాలోని జకార్తాలో జరగనున్న Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశానికి ఆసియా నలుమూలల నుంచి విచ్చేయనున్న కతోలిక నాయకులకు ఘన స్వాగతం పలికేందుకు ఇండోనేషియా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
వారం రోజులపాటు కొనసాగే ఈ సమావేశం సజావుగా నిర్వహించడమే కాకుండా, ప్రతినిధులు ఇండోనేషియాకు చేరుకున్న క్షణం నుంచి తిరుగు ప్రయాణం చేసే వరకు వారికి సురక్షితమైన, సౌకర్యవంతమైన, ఆత్మీయమైన అనుభూతిని కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
ఇండోనేషియా మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, జూలై 7న మత వ్యవహారాల మంత్రి నసరుద్దీన్ ఉమర్ అధ్యక్షతన జరిగిన అంతర్శాఖల సమన్వయ సమావేశంలో, ప్రతినిధుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.
"వీరు మత నాయకులు. కాబట్టి ఇండోనేషియాలో ఉన్నంతకాలం వారు ప్రశాంతతను, ఆత్మీయతను అనుభవించేలా చూడాలని మేము కోరుకుంటున్నాం," అని మంత్రి నసరుద్దీన్ ఉమర్ తెలిపారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖల ప్రతినిధులు, స్థానిక నిర్వహణ సమాఖ్య సభ్యులు పాల్గొని, భద్రత, రవాణా, ప్రజా సమాచార వ్యవస్థలు తదితర పరిపాలనా ఏర్పాట్లపై సమన్వయం సాధించారు.
ఆతిథ్య నాణ్యత ఇండోనేషియా ఆతిథ్య దేశంగా పోషిస్తున్న బాధ్యతకు ప్రతిబింబమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. విభిన్న దేశాలు, సంస్కృతుల నుంచి ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో, వారి ఆహారపు అలవాట్లు, సాంస్కృతిక సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి అంశాన్ని నిర్వాహకులు జాగ్రత్తగా సిద్ధం చేస్తున్నారు.
ఈ ఏర్పాట్లలో జకార్తా ప్రాంతీయ ప్రభుత్వం, ఇండోనేషియా జాతీయ పోలీసు విభాగం, జాతీయ సాయుధ దళాలు, ఇమ్మిగ్రేషన్ డైరెక్టరేట్ జనరల్, ఇస్తిక్లాల్ మసీదు యాజమాన్యం, జకార్తా అగ్రపీఠం, అలాగే ప్రభుత్వ ప్రసార సంస్థలు పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయి.
జూలై 26న జకార్తా బృహద్దేవాలయంలో ముగింపు దివ్యబలి అనంతరం, ప్రతినిధులు "టన్నెల్ అఫ్ ఫ్రెండ్షిప్" (Tunnel of Friendship) గుండా ఇస్తిక్లాల్ మసీదును సందర్శించనున్నారు. అదే రోజు జకార్తాలో ప్రతి వారం నిర్వహించే కార్-ఫ్రీ డే కూడా ఉండటంతో, రవాణా, ప్రజల రద్దీ నియంత్రణ వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రతినిధులను చిన్న చిన్న బృందాలుగా సొరంగం గుండా తీసుకువెళుతూ, అంతర్మత సంభాషణ, సౌభ్రాతృత్వం, శాంతియుత సహజీవనానికి ప్రతీకగా నిలిచిన ఈ టన్నెల్ అఫ్ ఫ్రెండ్షిప్ చరిత్ర, ప్రాధాన్యాన్ని వారికి వివరించనున్నారు.
శారీరకంగా ప్రత్యేక సహాయం అవసరమైన ప్రతినిధుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వీల్చైర్లు లేదా ఇతర సహాయక సదుపాయాలు అవసరమైన వారిని ముందుగానే గుర్తించి, సమాఖ్య ప్రారంభానికి ముందే అన్ని సేవలు సిద్ధంగా ఉంచాలని నిర్వాహకులకు సూచించారు.
2024లో పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ ఇండోనేషియా అపోస్తలిక పర్యటన సందర్భంగా ప్రభుత్వం పొందిన అనుభవం ఈ ఏర్పాట్లకు ఎంతో దోహదపడుతోందని మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పరిశుద్ధ పోప్తో పాటు వేలాది మంది యాత్రికులకు విజయవంతంగా ఆతిథ్యం అందించింది.
అయితే, FABC ప్లీనరీ సమాఖ్య సమావేశం భిన్నమైన సవాళ్లను కలిగి ఉందని అధికారులు పేర్కొన్నారు. పరిపాలనా ఏర్పాట్లతో పాటు, ఆధ్యాత్మిక వాతావరణం, పాస్టోరల్ ఆతిథ్యం, శ్రీసభ నాయకుల పట్ల శ్రద్ధతో కూడిన సేవాభావం కూడా ఈ సమావేశ విజయానికి అత్యంత కీలకమని వారు అభిప్రాయపడ్డారు.
"ప్రతి ప్రతినిధి ఇండోనేషియాకు అడుగుపెట్టిన క్షణం నుంచే మా ఆతిథ్యాన్ని అనుభవించాలి. వారు సమాఖ్య సమావేశంలో పూర్తిగా పాల్గొనడమే కాకుండా, ఇండోనేషియా సామరస్య సంస్కృతి, శాంతియుత సహజీవనాన్ని ప్రత్యక్షంగా అనుభవించేలా ప్రతి ఏర్పాటును అత్యంత శ్రద్ధతో చేస్తున్నాం," అని మంత్రి నసరుద్దీన్ ఉమర్ తెలిపారు.
FABC 12వ ప్లీనరీ సమాఖ్య సమావేశంలో ఆసియాలోని 29 దేశాల నుంచి పీఠాధిపతులు, శ్రీసభ నాయకులు పాల్గొననుండగా, యూరప్, అమెరికా, ఆఫ్రికా ఖండాల నుంచి కూడా ఆహ్వానిత ప్రతినిధులు హాజరుకానున్నారు.
సమాఖ్యలో జరిగిన చర్చల ఫలితాలతో పాటు, మత సామరస్యం, ఆతిథ్యం, వైవిధ్యంలో ఐక్యతకు అంకితభావంతో నిలిచిన దేశంగా ఇండోనేషియా గురించి చిరస్మరణీయమైన అనుభూతిని ప్రతినిధులు తమతో తీసుకెళ్తారని ఇండోనేషియా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.