రోమ్లో జరుగుతున్న జూబ్లీ కి శ్రీకాకుళం మేత్రాసన బిషప్ మరియు ఫాదర్లు హాజరయ్యారు

రోమ్లో జరుగుతున్న జూబ్లీ కి శ్రీకాకుళం మేత్రాసన బిషప్ మరియు ఫాదర్లు హాజరయ్యారు
2025 జూబ్లీ సంవత్సరంలో భాగమైన మూడు జూబ్లీ కార్యక్రమాలకు దాదాపు 6000 మంది ఫాదర్(గురువు)లు మరియు సెమినేరియన్లు రోమ్ లో జరిగే ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. శ్రీకాకుళం మేత్రాసన పీఠకాపరి మహా పూజ్య విజయ్ కుమార్ గారు మరియు శ్రీకాకుళ మేత్రాసన ఫాదర్(గురువు)ల బృదంతో కలిసి రోమ్లో ఉన్నారు.
జూన్ 23 నుండి 24 వరకు సెమినేరియన్ల కొరకు జూబ్లీ, జూన్ 25న బిషప్ల కొరకు జూబ్లీ, జూన్ 25 నుండి 27 వరకు ఫాదర్(గురువు)ల కొరకు జూబ్లీ జరుగుతున్నాయి.
ప్రధాన కార్యక్రమాలకు ముందు, పొంటిఫికల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫారిన్ మిషన్స్ (PIME) సభ్యులు మహా పూజ్య విజయ్ కుమార్ గారు, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో మిషనరీ పనికి మద్దతు ఇచ్చే ఇటాలియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ (CEI) ను సందర్శించడానికి ఫాదర్(గురువు)ల ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. ప్రతినిధి బృందం ఇటాలియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ డైరెక్టర్ ఫాదర్ గాబ్రియేల్గారిని కలిసింది.
ఈ ప్రతినిధిల బృందం అధికారికంగా విశ్వాస ప్రచారం కోసం "పవిత్ర సమాజం"(Sacred Congregation) అని పిలువబడే ప్రచార ఫైడ్(Offices of Propaganda Fide) కార్యాలయాలను కూడా సందర్శించారు. ఇది రోమన్ క్యూరియాలోని ఒక విభాగం. ఇది ప్రపంచవ్యాప్తంగా మిషనరీ పని మరియు సంబంధిత కార్యకలాపాలను పర్యవేక్షించడం మరియు సమన్వయం చేయడం దీని ప్రధాన విధి. ప్రస్తుతం, ఇది పోప్ ఫ్రాన్సిస్ రోమన్ క్యూరియా సంస్కరణలో భాగంగా స్థాపించబడిన డికాస్టరీ ఫర్ ఎవాంజెలైజేషన్లో(Dicastery for Evangelization) భాగం.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer