భక్తి శ్రద్ధలతో 14 దేవాలయాలలో సిలువమార్గం

భక్తి శ్రద్ధలతో 14 దేవాలయాలలో సిలువమార్గం
హైదరాబాద్ అతిమేత్రాసనం లో "ఎలోహిం హీలింగ్ మినిస్ట్రీస్" వారి ఆద్వర్యం లో 14 దేవాలయాలలో సిలువమార్గం మార్చి 25 న భక్తి శ్రద్ధలతో జరిగింది. బ్రదర్ అంతోనీ పాట్రిక్ గారు ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించారు.
వివిధ విచారణాల నుండి సుమారు 200 మంది ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు అమృతవాణి నుండి ఈ కార్యక్రమం మొదలైనది. 3 బస్సులలో, కార్లలో భక్తులు పాల్గొన్నారు.ప్రతి ఒక్కరు సిలువను పట్టుకొని ప్రతి దేవాలయాన్ని సందర్శించారు. ప్రతి విచారణలో సిలువమార్గం (ఒక్కొక స్థలం) భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
వివిధ విచారణ కర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వాసుల కొరకు ప్రత్యేకించి ప్రార్ధించారు. రాత్రి 11:00 గంటలకు అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు చివరి దివ్యపూజాబలిని సమర్పించి , విశ్వాసుల కొరకు ప్రార్ధించారు.
బ్రదర్ అంతోనీ పాట్రిక్ గారు విశ్వాసులకు ప్రేమ విందును ఏర్పాటు చేసారు. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Design and Article By
M Kranthi Swaroop
RVA Telugu Online producer