భక్తిశ్రద్ధలతో తపస్సు కాల ప్రత్యేక దివ్య బలిపూజ

భక్తిశ్రద్ధలతో  తపస్సు కాల ప్రత్యేక  దివ్య బలిపూజ

హైదరాబాద్ అతిమేత్రాసనం పునీత జోజప్ప గారి దేవాలయం, బొల్లారం  విచారణలో తపస్సు కాల ప్రత్యేక  దివ్య బలిపూజ  భక్తిశ్రద్ధలతో జరిగింది. విచారణ కర్తలు  గురుశ్రీ వేలంటైన్ డిమెల్లో  గారి  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.


గురుశ్రీ వేలంటైన్ డిమెల్లో గారు ఈ శ్రమదినాలలో విశ్వాసులు ఆధ్యాత్మికంగా ముందుకు నడిచేలా  వారి కొరకు తపస్సు కాల ప్రత్యేక ప్రార్థన  కార్యక్రమాలను ఏర్పాటు చేసారు.

బుధవారం నాడు  అనగా  20  మార్చి సాయంత్రం  5.30  గంటలకు  సిలువమార్గం  అనంతరం  దివ్య బలిపూజ, దివ్యసత్ప్రసాద ఆరాధన  ను నిర్వహించారు. గురుశ్రీ  పప్పుల సుధాకర్ , డైరెక్టర్, అమృతవాణి గారు  పాల్గొని అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు.

అధికసంఖ్యలో విచారణ ప్రజలు ,సిస్టర్స్ ఈ ప్రార్థనలో పాల్గొన్నారు.

విచారణ ప్రజలను ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్న గురుశ్రీ వేలంటైన్ డిమెల్లో గారిని ఆ దేవాది దేవుడు దీవించాలని కోరుకుంటూ మీ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer