భక్తియుతంగా సంపూర్ణ రాత్రి జాగరణ ప్రార్ధనలు

భక్తియుతంగా సంపూర్ణ రాత్రి జాగరణ ప్రార్ధనలు 

విజయవాడ మేత్రాసనం, గుణదల మాత పుణ్యక్షేత్రంలో, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల కరిసమేటిక్ బృందం వారిచే  రాత్రి జాగరణ ప్రార్ధనలు భక్తియుతంగా నిర్వహించబడ్డాయి. పెంతుకోస్తు పండుగ సందర్భముగా ఈ ప్రత్యేక పార్థనాలను నిర్వహించారు. 

జూన్ 7తేదీ సాయంత్రం 8.30గంటలకు ప్రారభించి జూన్ 8తేదీ ఉదయం 5గంటల వరకు ఈ  సంపూర్ణ రాత్రి జాగరణ ప్రార్ధనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఫాదర్ హృదయరాజ్, ఫాదర్ యోహాను, ఫాదర్ చిన్నప్ప గార్లు పాల్గొని దివ్య బలిపూజను అర్పించారు. అధికసంఖ్యలో విశ్వాసులు ఈ ప్రార్థనలలో పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో సిస్టర్. మేరీ ప్రకాశి, బ్రదర్ లూయిస్ బాబు, బ్రదర్ వాడపల్లి సత్యం, బ్రదర్ వర్గీస్ వారు వాక్యపరిచర్య చేశారు. సిస్టర్ ప్రసాదమ్మ, రాజేష్, సుధాకర్ లు స్తుతి ఆరాధనను నడిపించారు.  విశ్వాసులు, యువతీ యువకులు , భక్తిశ్రద్ధలతో ఈ ప్రార్థనలలో పాల్గొని ఆ దేవాది దేవుని దీవెనలు పొందుకున్నారు.

 

Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer