దృఢ విశ్వాసం కలిగిన మతప్రచారకులుగా ఉండమని పిలుపునిచ్చిన పోప్ ఫ్రాన్సిస్

సిసిలీలో కొనసాగుతున్న సామాజిక సవాళ్ల మధ్య  దృఢ విశ్వాసం, నమ్మిక కలిగిన మతప్రచారకులుగా ఉండమని పిలుపునిచ్చిన పోప్ ఫ్రాన్సిస్

సిసిలీలోని శాన్ ప్యాలో థియోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాటానియా 200 మంది ఫార్మేటర్‌లు,  మరియు విద్యార్థులతో డిసెంబర్ 6 శుక్రవారం ఉదయం పోప్ ఫ్రాన్సిస్ ఈ బలమైన ప్రోత్సాహాన్ని అందించారు.

"సిసిలీ భవిష్యత్తును ఆశతో చూడగలిగే ప్రజలు అవసరమని , వారు ఒకరితోఒకరు కలిసి పయనిస్తూ, మతపరమైన మరియు సామాజిక జీవితాన్ని ప్రభావితం చేయగల విస్తృత-ఆధారిత నిర్మాణానికి తోడ్పడాలి అని అన్నారు 

ఈ సంస్థ 1969లో స్థాపించబడింది, రెండవ వాటికన్ కౌన్సిల్‌ను అనుసరించి, తూర్పు సిసిలీ మేత్రాసనాల  గురువులు, మతపరమైన మరియు సామాన్య ప్రజల వేదాంత ఏర్పాటుకు కేంద్రాన్ని నిర్ణయించుకున్నారు.

స్థానిక శ్రీసభకు ఈ సంస్థ అందించిన ముఖ్యమైన సహకారాన్ని గుర్తించి, దానికి అనుబంధంగా ఉన్న థియోలాజికల్ ఫ్యాకల్టీ ఆఫ్ పలెర్మోతో దాని సహకారం, కలిసి ప్రయాణించడానికి ఇతర చర్చిలను ప్రేరేపించగల ఒక నమూనాను సూచిస్తుంది" అని పోప్ ఫ్రాన్సిస్ వ్యాఖ్యానించారు 

ప్రాంత అభివృద్ధికి ఆటంకం కలిగించే విస్తృతమైన అవినీతి, వ్యవస్థీకృత నేరాలతో సహా ప్రాంతంలో  కొనసాగుతున్న సవాళ్లను ప్రస్తావిస్తూ, పేదరికాన్ని నిర్మూలించడానికి, కొత్త తరాలను స్వేచ్ఛగా మరియు పారదర్శకంగా ఉండేలా శిక్షణ ఇవ్వగల ప్రజలు సిసిలీకి అవసరం" అని పోప్ ఫ్రాన్సిస్ ముగించారు

Telugu Survey Popup Image