గాజా బాధితులను పరామర్శించిన జెరూసలేం మత పెద్దలు
గాజా బాధితులను పరామర్శించిన జెరూసలేం మత పెద్దలు
జూన్ 22వ తేదీన, జెరూసలేం క్రైస్తవ మత పెద్దలు (పాట్రియార్క్లు) గాజా స్ట్రిప్లో పర్యటించి, అక్కడ యుద్ధం కారణంగా తీవ్రంగా గాయపడిన మరియు ఇబ్బందులు పడుతున్న విశ్వాసులను, స్థానిక ప్రజలను పరామర్శించారు.
యుద్ధం వల్ల సర్వస్వం కోల్పోయి, తీవ్ర భయాందోళనలు, నిరాశలో ఉన్న గాజా క్రైస్తవ సంఘాలకు మరియు ఇతర పౌరులకు జెరూసలేం క్రైస్తవ దేవాలయాల తరపున ప్రార్థనలను, ధైర్యాన్ని అందించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.
ఈ కార్యక్రమంలో మహా పూజ్య కార్డినల్ పియర్బాటిస్టా పిజ్జాబల్లా గారు , గ్రీక్ ఆర్థోడాక్స్ పాట్రియార్క్ మహా పూజ్య పాట్రియార్క్ థియోఫిలోస్ III గారు మరియు వీరితో పాటు సార్వభౌమ మిలిటరీ ఆర్డర్ ఆఫ్ మాల్టా ప్రతినిధులు కూడా ఈ మానవతా మిషన్లో పాల్గొన్నారు. వీరికి అక్కడ ప్రజల చప్పట్లు మరియు కేకలతో స్వాగతం లభించింది.
గాజాలోని 'హోలీ ఫ్యామిలీ' కాథలిక్ చర్చిని సందర్శించి, అక్కడ ఆశ్రయం పొందుతున్న బాధితులను కలిశారు. అలాగే చర్చిల ద్వారా అందుతున్న వైద్య, ఆహార సహాయక చర్యలను వారు స్వయంగా పరిశీలించారు.
మహా పూజ్య కార్డినల్ పిజ్జాబల్లా గారు అంతకుముందు డిసెంబర్ 19, 2025న గాజా ప్రజలను సందర్శించారు. రెండు రోజుల తర్వాత, డిసెంబర్ 21న, ఆయన హోలీ ఫ్యామిలీ విచారణ లో క్రిస్మస్ ప్రార్థనలు జరిపారు. ఈ వేడుకకు హాజరైన అనేకమంది విశ్వాసులు ఎంతగానో ప్రభావితులయ్యారు.
యుద్ధ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నప్పటికీ, తాము గాజాలోని క్రైస్తవులను ఒంటరిగా వదిలేయబోమని, వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని మతపెద్దలు స్పష్టం చేశారు.
Article and Design BY
M Kranthi Swaroop