ఖైరతాబాద్ మరియ మాత ..
మరియమాత జన్మదినోత్సవం |ఖైరతాబాద్ మరియ మాత
హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఉన్న 'అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్' పుణ్యక్షేత్రం లో ధన్య కన్య మరియమ్మ జనన వార్షిక పండుగ ఘనంగా జరుగుతుంది. క్రైస్తవ విశ్వాసుల తో పాటు వివిధ మత నేపథ్యాలకు చెందిన ప్రజలు తరలివస్తున్నారు.
ఈ వార్షిక వేడుక ఆగష్టు 29న పండుగ పతాకాన్ని ఎగురవేయడంతో ప్రారంభమైంది. దీని తర్వాత ఆగష్టు 30 నుండి సెప్టెంబర్ 7 వరకు తొమ్మిది రోజుల నొవేనా ప్రార్థనలు జరిగాయి. పండుగ రోజు అయిన సెప్టెంబర్ 8న, హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ ఆంథోనీ పూల గారి అధ్యక్షతన 11:15 గంటలకు దివ్యబలిపూజ మొదలైనది.
ప్రతి సంవత్సరం లాగానే సాయంత్రం, పుణ్యక్షేత్రంలోని అద్భుతమైన మేరీ మాత స్వరూపాన్ని వీధుల గుండా ఊరేగింపులో తీసుకువెళ్లనున్నారు. వేలాది మంది భక్తులు 'మంచి ఆరోగ్య మాత' అనే బిరుదుతో మేరీకి తమ కుటుంబాలను, కష్టాలను మరియు ఆశలను అప్పగిస్తూ, ప్రార్థనలో ఆ స్వరూపంతో పాటు ప్రార్దర్శన వెళ్తారు.
అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ పుణ్యక్షేత్రం, మదర్ మేరీకి అంకితం చేయబడిన ఆసియాలోని మొట్టమొదటి "అష్టభుజి కాథలిక్ చర్చి"గా పరిగణించబడుతుంది.
ఈ పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర 1903 నాటిది. ఆఫ్రికన్ కావల్రీ గార్డ్స్లో మోహరించిన సైనిక సిబ్బంది సేవ కోసం సైనిక భూమిలో ఒక చర్చిని నిర్మించడానికి నిజాం VI, మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనుమతి ఇచ్చారు.
ప్రస్తుతం పుణ్యక్షేత్రంలో పూజించబడుతున్న మేరీ మాత స్వరూపాన్ని 1903లో ఇటలీ నుండి తీసుకువచ్చారని చారిత్రాత్మకంగా నమ్ముతారు. తరతరాలుగా, భక్తులు ఈ స్వరూపాన్ని ఒక అద్భుతంగా భావిస్తూ, స్వస్థత, ఓదార్పు మరియు ఆశ కోసం ప్రార్థనలతో దీని వద్దకు వస్తుంటారు.
ప్రస్తుత అష్టభుజి చర్చి, 27 సంవత్సరాల పాటు విచారణకర్తలుగా సేవ చేసిన మలేషియన్ మిషనరీ అయిన దివంగత ఫాదర్ జేవియర్ రోచ్ నాయకత్వంలో నిర్మించబడింది. ఫాదర్ జేవియర్ రోచ్ గారు 1974లో మరణించే వరకు ఈ పుణ్యక్షేత్రంతో అనుబంధం కలిగి ఉన్నారు మరియు తాను నిర్మించడంలో సహాయపడిన చర్చిలోనే ఆయనను ఖననం చేశారు.
ప్రస్తుత చర్చికి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, దివంగత ఆర్చ్ బిషప్ జోసెఫ్ మార్క్ గోపుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ చర్చిని 1959లో నిజాం ప్రారంభించారు.
Article and Design BY M Kranthi Swaroop
