క్రైస్తవుల సహాయమాత గుహ ప్రతిష్ఠ మహోత్సవం

ఖమ్మం మేత్రాసనం, తల్లాడ మండలం, మంగాపురం గ్రామం బోస్కోనగర్ విచారణ తిరుకుటుంబ దేవాలయ ప్రాంగణంలో మే 24న ఉదయం 9 గంటలకు క్రైస్తవుల సహాయమాత గుహ ప్రతిష్ట ఘనంగా జరిగింది.

ఖమ్మం మేత్రాసన పీఠకాపరి మహా పూజ్య సగిలి ప్రకాష్ గారు ఈ నూతన గుహను ఆశీర్వదించి ప్రతిష్ఠించారు. 

ఈ మహోత్సవంలో సుమారు 20 మంది గురువులు, 3500 మంది విశ్వాసులు పాల్గొన్నారు.

విచారణ గురువులు గురుశ్రీ కే రాజేష్ SDB గారు ప్రతిష్ఠోత్సవానికి  విచ్చేసిన పీఠాధిపతులకు, గురువులకు, మంగాపురం సంఘస్తులకు, విశ్వాసులకు, యువతీ యువకులకు కృతజ్ఞతలు తెలిపారు.
 

Tags