ఏప్రిల్ నెల రాత్రి జాగరణ సువార్త స్వస్థత కూటమి


ఏప్రిల్ నెల రాత్రి జాగరణ సువార్త స్వస్థత కూటమి

విశాఖ డివైన్ ధ్యాన కేంద్రం, కంటకాపల్లి వారు ఏప్రిల్ నెల రాత్రి జాగరణ సువార్త స్వస్థత కూటమును నిర్వహించనున్నారు.  విశాఖ డివైన్ ధ్యానకేంద్ర డైరెక్టర్  గురుశ్రీ డా॥ మరియదాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రం జరుగుతున్నది.

విశాఖ డివైన్ ధ్యానకేంద్రం, కంటకాపల్లి లో ఏప్రిల్ 26, 2024 (శుక్రవారం) రాత్రి 10.00 గం||ల నుండి ఉ॥ 5.00 గం||ల వరకు ఈ "రాత్రి జాగరణ సువార్త స్వస్థత కూటమి" జరగనున్నది. గురుశ్రీ డా॥ మరియదాస్ గారు దైవ సందేశాన్ని ప్రజలకు అందించనున్నారు.  గుడ్ మోర్నింగ్ హోలీ స్పిరిట్ బృందము వారు రాత్రి జాగరణ ప్రార్ధనను జరపనున్నారు.

కార్యక్రమంలో భాగంగా రాత్రి 9.30 గం॥ లకు జపమాల
రాత్రి 10.00 గం॥ లకు దివ్యబలిపూజ
రాత్రి 10.30 గం॥ లకు స్తుతి గీతములు
రాత్రి 11.00 గం||లకు వాక్యపరిచర్య
రాత్రి 12.00 గం॥ లకు దివ్యసత్ప్రసాద ఆరాధన వాక్య పరిచర్య
ఉ॥ 02.00 గం॥ లకు పరిశుద్ధ శిలువ మార్గం
ఉ॥ 03.00 గం||లకు స్వస్థత ప్రార్థనలు
ఉ॥ 04.00 గం॥లకు దివ్యబలిపూజలను నిర్వహించనున్నారు. గురుశ్రీ డా॥ మరియదాస్ గారు ప్రజలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు.

Article and Design By
M kranthi Swaroop
RVA Telugu Online Producer