బొగ్గు ఆధారిత ప్లాంట్లను నిలిపివేయాలి - ఫిలిప్పీన్స్ పర్యావరణ కార్యకర్తలు

బొగ్గు ఆధారిత ప్లాంట్లను నిలిపివేయాలి - ఫిలిప్పీన్స్ పర్యావరణ కార్యకర్తలు
సెంట్రల్ ఫిలిప్పీన్స్ సమీపంలోని బొగ్గుతో నడిచే ప్లాంట్ కారణంగా పొరుగు ప్రజలు ఇప్పటికే బొగ్గు దుమ్ము, ఇతర కాలుష్య కారకాలు, శబ్దం మరియు స్థానిక రహదారుల ప్రమాదకరమైన రద్దీ ప్రభావాలను అనుభవిస్తున్నారు.
సిబూ ప్రావిన్స్లోని టోలెడోలోని బాటో గ్రామంలో నివసించే హోనోరిడెజ్, ప్రతి రోజు బొగ్గుతో నడిచే ప్లాంట్ నుండి వచ్చిన శబ్దం కారణంగా అతని ఇంటి గోడలు బీటలు పాడడం జరుగుతుంది.
2019లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన 340 మెగావాట్ల బొగ్గు పవర్ ప్లాంట్ అతని నిద్రకు భంగం కలిగించడమే కాకుండా, కిటికీలు, తలుపులు మరియు తలుపులను కప్పి ఉంచే బూడిద మరియు బొగ్గు ధూళిని తో తన ఇల్లు నిండిపోతుంది అని తెలిపారు.
ఫిలిప్పీన్స్లో బాటో మరియు సమీప గ్రామాలలో సుమారు 9,000 మంది ప్రజలు రెండు బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ల సమీపంలో నివసిస్తున్నందున ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు.
బాటోకు దగ్గరగా ఉన్న గ్రామమైన ఐబోకు చెందిన అభివృద్ధి కార్యకర్త మరియు వాతావరణ న్యాయ కార్యకర్త అయిన ప్రిమో లామెలా, టోలెడోలోని పవర్ ప్లాంట్లపై అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
బొగ్గుతో నడిచే ప్లాంట్ వల్ల తన 16 ఏళ్ల కూతురు ఉబ్బసంతో బాధపడుతుండగా, తనకు క్షయవ్యాధి వచ్చిందని లామెలా చెప్పారు.
ఈ సంవత్సరం, అతను ప్లాంట్ను మూసివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థుల నుండి సంతకాల సేకరణతో సహా సంఘం ప్రచారానికి నాయకత్వం వహించాడు.
ఏప్రిల్ 4న, లామెలా మరియు అతని NGO నగరం యొక్క శాంతి కి ముప్పుగా పేర్కొనబడ్డాయి అని, మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఫిలిప్పీన్స్ యొక్క నిషేధిత సాయుధ విభాగం అయిన న్యూ పీపుల్స్ ఆర్మీ (NPA) మద్దతుదారులుగా వీరిని ఆ జాబితా లో చేర్చారు.
కార్యకర్తలను కమ్యూనిస్ట్ సానుభూతిపరులుగా పేర్కొనడం ద్వారా అసమ్మతిని అణిచివేసేందుకు భద్రతా దళాలు విస్తృతంగా ఉపయోగించే దశాబ్దాల నాటి ఆచారం ఇది.
దశాబ్దాలుగా, ఫిలిపినోలు విద్యుత్ కోసం బొగ్గును ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఇది ఇటీవల తీవ్రమైంది.
సెప్టెంబరు 13న, బొగ్గు కాలుష్యం కారణంగా ప్రభావితమైన 12 సంఘాలకు చెందిన 1,000 మందికి పైగా కార్యకర్తలు మరియు ప్రతినిధులు, టోలెడో మరియు పొరుగున ఉన్న నాగా సిటీ నుండి, రాజధాని మనీలాలో భారీ ర్యాలీలో చేరారు, దేశంలో మరియు ఆసియా అంతటా శిలాజ ఇంధన దహనాన్ని నిలిపివేయాలని పిలుపునిచ్చారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer