విజయవాడలో మహిళా దినోత్సవ వేడుకలు

విజయవాడ మేత్రాసనం, పాయకాపురం పునిత మదర్ తెరెసా గారి దేవాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. 

పాయకాపురం విచారణలో గురుశ్రీ పాతపాటి విజయ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 

డాక్టర్ గోలి ఇందిరా ప్రియ దర్శిని (MBBS,DGO గైనకాలజిస్ట్),బొంతా ఫిలోమినా రిటైర్డ్ టీచర్
మేత్రాసన మరియ దళ అధ్యక్షురాలు,కోటి రోజా పుష్పమ్మ,చిన్నం రోజనమ్మ
తేలప్రోలు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు, సిస్టర్ థెరిసా వనమాల(పాయకాపురం-సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల HM) బండారు ఫ్రాన్సినా (విచారణ మరియదళ అధ్యక్షురాలు) గార్లను వారు చేస్తున్న సేవలను గుర్తించి సత్కరించారు 

సుమారు 150 విచారణ మహిళలు మరియు విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెన్ననపూడి విచారణ గురువులు గురుశ్రీ కూచిపూడి ప్రశాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి గురుశ్రీ పాతపాటి విజయ్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.