పేద పిల్లలకు ప్రేమను పంచడం చాలా అవసరం - బ్రదర్ సత్యం

పేద పిల్లలకు ప్రేమను పంచడం చాలా అవసరం - బ్రదర్ సత్యం
ప్రభు యేసుని ప్రేమను చాటుతూ కడు పేద పిల్లలకు బ్రదర్ సత్యం గారు తన సహాయాన్ని అందిస్తున్నారు.
ఖమ్మం మేత్రాసనం, పెనుబల్లి విచారణ పరిధిలోని చౌడవరం గ్రామంలో చెట్లకింద నివాసం ఉంటున్నపేద పిల్లలను, బాల కార్మికులను అక్కున చేర్చుకుని వారికీ సహాయాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం 35 మంది పిల్లల ఇక్కడ ఉంటున్నారు . బ్రదర్ సత్యం
గారు 2019 నుండి ప్రతినెలా క్రమం తప్పకుండా వారిని సందర్శిస్తూ, రెండు మూడు రోజులపాటు వారి దగ్గర ఉండి వారి బాగోగులు చూసుకుంటున్నారు.
మే నెల చివరివారంలో బ్రదర్ సత్యం గారు వారిని సందర్శించి వారికీ ఉచిత బట్టలను, ఆహారాన్ని అందించడం జరిగింది.
బ్రదర్ సత్యం గారు మాట్లాడుతూ "పేద పిల్లలకు విద్య మరియు శిక్షణ అవకాశాలు కల్పించడం ద్వారా వారి జీవితాన్ని మెరుగుపరచవచ్చు అని అన్నారు. పేద పిల్లలకు ప్రేమను పంచడం చాలా అవసరం అని, ప్రేమను పంచడం వల్ల మనం వారి జీవితంలో ఒక మార్పు తీసుకురావచ్చు అని, మరియు వారి భవిష్యత్తును మెరుగుపరచవచ్చు అని అన్నారు.
బ్రదర్ సత్యం గారు తాను చేసే వివిధ కార్యక్రమాలతో ప్రభు యేసుని ప్రేమను లోకానికి తెలియజేస్తున్నారు.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer