"జాతీయ యువతా దినోత్సవం"

ప్రేరణ యూత్ సెంటర్ వారి ఆధ్వర్యంలో జులై 28 న "జాతీయ యువతా దినోత్సవం"

విజయవాడ మేత్రాసనం , ప్రేరణ యూత్ సెంటర్ వారి ఆధ్వర్యంలో జాతీయ యువతా దినోత్సవం జులై 28 న జరగనున్నది. ప్రేరణ యూత్ సెంటర్ డైరెక్టర్ గురుశ్రీ  జోజి తంబి గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నవి.

ఈ కార్యక్రమాన్ని విజయవాడ మేత్రాసన పాస్టరల్ సెంటర్ , కార్మెల్ నగర్ లో నిర్వహించనున్నారు.  "జాతీయ యువతా దినోత్సవ" వేడుకలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నవి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయవాడ పీఠాధిపతులు మహా పూజ్య తెలగతోటి జోసఫ్ రాజారావు గారు పాల్గొననున్నారు.

గురుశ్రీ జోజి తంబి గారు వివిధ ప్రార్థన కార్యక్రమాలతో యువతీ, యువకులను ప్రభు యేసుని మార్గంలో ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్నారు. జులై 28 న జరగనున్న  "జాతీయ యువతా దినోత్సవ " వేడుకలకు యువతీ యువకులను గురుశ్రీ జోజి తంబి గారు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ఇతర వివరములు కొరకు సంప్రదించాల్సిన నెంబర్ +91  9052766233.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer