మొదలైన పునీత అన్నమ్మగారి మహోత్సవ నవదిన ప్రార్థనలు

మొదలైన పునీత అన్నమ్మగారి మహోత్సవ నవదిన ప్రార్థనలు

విశాఖ అతిమేత్రాసనం సెయింట్ ఆన్స్ కో కథెడ్రల్ విచారణ, పునీత అన్నమ్మగారి మహోత్సవ నవదిన ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. విచారణ కర్తలు గురుశ్రీ మరియారత్నం గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి.  

పునీత అన్నమ్మగారి పండుగ మహోత్సవము జులై  26, 2024 న జరగనున్నది.

గురువారం  సాయంత్రం 6 గంటలకు పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.  
విశాఖ  అతిమేత్రాసన ఛాన్సలర్ గురుశ్రీ జొన్నాడ జాన్ ప్రకాశ్ గారు ఈ వేడుకలో పాల్గొని పతాక ఆవిష్కరణ  చేశారు.

గురుశ్రీ జొన్నాడ జాన్ ప్రకాశ్ గారు ఇతర గురువులతో కలసి దివ్యబలిపూజను సమర్పించారు.
గురుశ్రీ ఐజాక్ ,గురుశ్రీ సుధాకర్, గురుశ్రీ రాజేంద్రలు ఈ దివ్య బాలి పూజలో పాల్గొన్నారు.

నవదిన ప్రార్థనలో భాగంగా ప్రతి రోజు  సాయంత్రం గం॥ 5.30ని||లకు జపమాల, 6.00 గం॥లకు దివ్యబలిపూజ నిర్వహించబడును.

పండుగ రోజు సాయంత్రం 4 గంటలకు జపమాల, దివ్యసత్ప్రసాద ఆశీర్వాదం, సాయంత్రం 5.00 గంటలకు పుర ప్రదక్షిణ కార్యక్రమం అనంతరం  సాయంత్రం 6.00 గంటలకు
ఏలూరు మేత్రాణులు మరియు విశాఖ అతిమేత్రాసన అపోస్తోలిక పాలనాధికారి మహా పూజ్య  డా॥ జయరావు పొలిమేర మరియు ఇతర గురువులచే సమిష్టి దివ్యబలిపూజను నిర్వహించనున్నారు.

పండుగకు  ప్రేమతో ఆహ్వానించువారు విచారణ కర్తలు గురుశ్రీ మరియారత్నం గారు మరియు విచారణ కన్యస్త్రీలు, విచారణ సలహా సంఘ సభ్యులు మరియు విశ్వాసులు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer