భక్తియుతంగా సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ ప్రార్థన

భక్తియుతంగా సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ ప్రార్థన

విశాఖ అతిమేత్రాసనం యర్ర సామంతవలస విచారణ, క్రీస్తురాజు పుణ్య క్షేత్రంలో " ఒక్క రోజు సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ ప్రార్థన" భక్తియుతంగా జరిగింది. ఆదివారం రాత్రి క్రీస్తు రాజు పురం లోని పనసబద్ర నూతన దేవాలయం లో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు జరిగింది.

విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, యర్ర సామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యాక్రమం జరిగింది. రాత్రి జాగరణ ప్రార్థనలో గురుశ్రీ శరగడం బాల శౌరి గారు పాల్గొని అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు. గురుశ్రీ అలమండ సంతోష్ గారు , గురుశ్రీ సైమన్ కింతలా, గురుశ్రీ మరియాదాస్, ఇతర గురువులు పాల్గొన్నారు.

ప్రత్యేక పరిశుద్ద సిలువ మార్గం ధ్యానం, దివ్య సత్ప్రసాద మహా ఆరాధన భక్తి శ్రద్ధలతో జరిగింది. విచారణ సిస్టర్స్, అధిక సంఖ్యలో విశ్వాసులు, విచారణ యువత ఈ రాత్రి జాగరణ ప్రార్థనలో పాల్గొన్నారు. దేవాలయంలో పాప సంకీర్తనలు మరియు స్వస్థత ప్రార్దనలు నిర్వహించారు. విచారణ గాయకబృందం మధురమైన గీతాలను ఆలపించారు.

విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు.

 

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer