భక్తియుతంగా మూడు రోజుల ప్రార్థన కూటాలు

జులై 11 -13 ,కర్నూలు మేత్రాసనం, జుపాడు బంగ్లా విచారణ, పారమంచాల గ్రామంలో మూడు రోజుల పాటు స్వస్థతా కూటాలు సీనాయి డివైన్ సెంటర్ వారు నిర్వహించారు 

విచారణ కర్తలు గురుశ్రీ రాజేష్ గారు, నందికొట్కూరు విచారణ కర్తలు గురుశ్రీ కే.డి. జోసఫ్ గారు,కర్నూలు పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ గురుశ్రీ ఈరి బాలరాజు గారు ఈ కూటాలలో పాల్గొన్నారు. 

ప్రేమగిరి, సీనాయి డివైన్ సెంటర్ డైరెక్టర్ గురుశ్రీ అజీశ్ గారి ఆధ్వర్యంలో గురు, శుక్ర శనివారాలలో దైవిక కూడికలు నిర్వహించారు.
తరలి వచ్చిన గురువులకు, ఆధ్యాత్మిక వడకాన్ని నడిపించిన ప్రేమగిరి బృందానికి గురుశ్రీ రాజేష్ గారు వందనాలు తెలియచేసారు.