పాకిస్తాన్ డయోసిస్‌లో తొలి క్యాథలిక్ నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన

పాకిస్తాన్ డయోసిస్‌లో తొలి క్యాథలిక్ నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన


ఏప్రిల్ 29న, తూర్పు పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్ డియోసెస్‌ పీఠాధిపతులు మహా పూజ్య ఇండ్రియాస్ రెహ్మత్ గారు, ఆ డియోసెస్‌లో మొట్టమొదటి క్యాథలిక్ నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేశారు.

మహా పూజ్య ఇండ్రియాస్ రెహ్మత్ గారు మాట్లాడుతూ "వైద్య , విద్య నేడు అత్యవసరం . అలాగే శ్రీసభ నుండి పేద ప్రజల  ఆరోగ్య సంరక్షణ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి మనకు చాలా మంది ఆరోగ్య కార్యకర్తలు కూడా అవసరం. ఆరోగ్య కార్యకర్తలుగా సేవ చేయాలనుకునే యువతకు మరిన్ని అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా, "సెయింట్ మేరీస్ బీఎస్ఎన్ కళాశాల" ఒక విద్యా కేంద్రంగా పనిచేస్తుంది," అని  అన్నారు. 

ఈ నర్సింగ్ కళాశాల ప్రాంతీయ ఆరోగ్య సంరక్షణ స్వరూపాన్ని మార్చివేసే ఒక చారిత్రాత్మక కార్యక్రమంగా అభివర్ణించారు. ఈ కొత్త నర్సింగ్ కళాశాల, నగరంలోనే కాకుండా ఫైసలాబాద్ కతోలిక  మేత్రాసనం  అంతటా శిక్షణ పొందిన వైద్య సిబ్బంది కొరతను తీర్చడంలో సహాయపడుతుందని మహా పూజ్య ఇండ్రియాస్ రెహ్మత్ గారు నొక్కి చెప్పారు.

 ఈసందర్భముగా మహా పూజ్య ఇండ్రియాస్ రెహ్మత్ గారు, ఇతర మతగురువులు, సిస్టర్స్ మరియు సామాన్య విశ్వాసులతో కలిసి నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేయడానికి ముందు దివ్యబలి పూజను సమర్పించారు.

RVAతో మాట్లాడుతూ “సెయింట్ మేరీస్ BSN కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్ (BSN) ప్రోగ్రామ్‌లో ఏటా 100 మందికి పైగా విద్యార్థులను చేర్చుకోవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము అని మహా పూజ్య ఇండ్రియాస్ రెహ్మత్ గారు తెలిపారు.

35,300 చదరపు కిలోమీటర్ల విస్తారమైన భూభాగాన్ని కలిగి ఉన్న ఫైసలాబాద్ కాథలిక్ డియోసెస్, 200,000 మందికి పైగా విశ్వాసులకు సేవలు అందిస్తోంది. ఈ డియోసెస్ రెండు ఆసుపత్రులు, ఆరు వైద్యశాలలు మరియు ఒక ప్రసూతి శిక్షణా పాఠశాలతో కలిగి ఉన్నది. 

 

Article and design by M kranthi swaroop