పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రత్యేక దివ్యబలిపూజ సమర్పించిన నిర్మల సభ కన్యస్త్రీలు

పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రత్యేక దివ్యబలిపూజ సమర్పించిన నిర్మల సభ కన్యస్త్రీలు 

సికింద్రాబాద్, పద్మారావునగర్ లోని నిర్మల ప్రొవిన్షలేట్ నుండి నిర్మల సంస్థ కన్యస్త్రీలు, హైదరాబాద్ అగ్రపీఠంలోని సీతాఫల్ మండి విచారణలో 15 సెప్టెంబర్ 2024 , ఆదివారం నాడు "ప్రకృతి - మానవ బాధ్యత" పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి సందేశాన్ని అనుసరిస్తూ, ప్రత్యేక దివ్యబలిపూజను సమర్పించారు. 

నిర్మల సంస్థ కన్యస్త్రీలు దివ్యబలి పూజకు ముందు చక్కని ముందు మాటను అందించారు. అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు దివ్యబలిపూజను సమర్పించారు.  గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు పాపు గారి యొక్క సందేశాన్ని, ప్రకృతిపై మానవాళికి ఉన్న బాధ్యతను, ప్రకృతిని మనం ఎలా పరిరక్షించుకోవాలి అనే అంశాలను మరియు పాపు గారి లేఖను విశ్వాసులకు చక్కగా వివరించారు. నిర్మల కన్యస్త్రీలు ప్రత్యేక విశ్వాసుల ప్రార్ధనను చేసారు.

ఈ దివ్యబలిపూజకు హాజరైన వారందరికీ విచారణ గురువులు గురుశ్రీ డేవిడ్ ఫ్రాన్సిస్ గారు కృతఙ్ఞతలు తెలిపారు.