నూతన దేవాలయం ప్రారంభోత్సవం | విశాఖ అతిమేత్రాసనం | ఉత్తరవల్లి విచారణ

ఉత్తరవల్లి విచారణ, జన్నివలసలో నూతన దేవాలయం ప్రారంభోత్సవం

విశాఖ అతిమేత్రాసనం, ఉత్తరవల్లి విచారణ, జన్నివలసలో నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవం  ఘనంగా జరిగింది. ఈ దేవాలయాన్ని  "పునీత అంతోని వారి దేవాలయం " గా నామకరణం చేసారు.  

జులై 17,2024 తేదీ బుధవారం  ఉ॥10 గం. ఈ దేవాలయ ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది.

ఏలూరు పీఠాధిపతులు మరియు విశాఖ అతిమేత్రాసన అపోస్తిలిక పాలన ఆధికారి మహా పూజ్య డా|| పొలిమేర జయరావు గారు నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవ దివ్య పూజబలిని ఇతర గురువులతో కలసి సమర్పించారు.  

ఈ కార్యక్రమంలో విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ డి బాలశౌరి , అతిమేత్రాసన ఛాన్సలర్ శ్రీ జొన్నాడ జాన్ ప్రకాశ్ , గురుశ్రీ యుగళ్ కుమార్ , గురుశ్రీ జోసెఫ్  బందనాదం,  గురుశ్రీ కోన జయరాజు, గురుశ్రీ హరీ ఫిలిప్స్,  గురుశ్రీ వేలంగాని రావు , గురుశ్రీ కిషోర్, గురుశ్రీ బాలరాజు,గురుశ్రీ ప్రతాప్, గురుశ్రీ  సైమన్ కింతలా, గురుశ్రీ నరేష్, గురుశ్రీ వేలంగాని  రాజు ఇతర గురువులు పాల్గొన్నారు.  

 సహకరించిన ప్రతి ఒక్కరికి గురుశ్రీ  ఆనంద్ మరియు గురుశ్రీ కిషోర్ లు  తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer