నిత్య ఆరాధన మందిరానికి శంకుస్థాపన

ఏలూరు పీఠం, అమలోద్భవిమాత బృహత్ దేవాలయ ప్రాంగణములో జూలై 25 ,2024 న నిత్య ఆరాధన మందిరానికి పునాది రాయి వేయండి జరిగింది.

హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహా పూజ్య పూల ఆంతోని తండ్రి గారు,ఏలూరు పీఠాధిపతులు,విశాఖపట్నం పాలనాధికారి, అమృతవాణి కమ్యూనికేషన్స్ సెంటర్ అధ్యక్షులు మహా పూజ్య పొలిమెర జయరావు తండ్రి గారు,ఖమ్మం పీఠాధిపతులు మహా పూజ్య సగిలి ప్రకాష్ తండ్రి గారు, నల్గొండ పీఠాధిపతులు మహా పూజ్య కరణం ధమన్ కుమార్ తండ్రి గారు పునాది  రాయిని ఆశీర్వదించి ప్రతిష్టించి,ఏలూరు మేత్రాసనాన్ని, పీఠాధిపతులను, గురువులను మఠవాసులను ఆ దేవాదిదేవుడు దీవించాలని కోరుకున్నారు 

ఈ నిత్య ఆరాధన మందిరాన్ని ఏలూరు పీఠాధిపతుల 11 వ పీఠాధిపత్య వార్షికోత్సవ సందర్బంగా శంకుస్థాపన చేసారు.

విచారణ కర్తలు గురుశ్రీ మైఖెల్ గారు విచ్చేసిన కార్డినల్ గారికి, పీఠాధిపతులకు ధన్యవాదాలు తెలియచేసారు