జలంధర్ నూతన పీఠాధిపతిగా గురుశ్రీ జోస్ సెబాస్టియన్ నియామకం

పంజాబ్‌లోని జలంధర్ నూతన పీఠాధిపతిగా ‌గురుశ్రీ జోస్ సెబాస్టియన్ తెక్కుమ్చెరికున్నెల్‌ను XIV లియో పోప్ నియమించారు. 
ఈ ప్రకటన శనివారం, 7 జూన్ 2025న వెలువడింది. 
గురుశ్రీ  జోస్ ప్రస్తుతం మేత్రాసన ఆర్థిక నిర్వాహకుడిగా పనిచేస్తున్నారు. 
 
వీరు 1962లో క్రిస్మస్ ఈవ్ నాడు పలై మేత్రాసన  పరిధిలోని కలకెట్టిలో జన్మించారు. 

జలంధర్  మేత్రాసనానికి  మే 1, 1991న గురువుగా అభిషేకింపబడ్డారు. ఆయన 1978లో త్రిచూర్‌లోని మైనర్ సెమినరీలో తన అర్చక నిర్మాణాన్ని ప్రారంభించారు. 

ఆయన 1982 మరియు 1991 మధ్య నాగ్‌పూర్‌లోని సెయింట్ చార్లెస్ ఇంటర్-డయోసెసన్ సెమినరీలో తత్వశాస్త్రం మరియు వేదాంతశాస్త్రం అభ్యసించారు.

 తరువాత ఆయన 2002 నుండి 2004 వరకు రోమ్‌లోని పోంటిఫికల్ అర్బన్ విశ్వవిద్యాలయం నుండి కానన్ లాలో లైసెన్సియేట్ పొందారు. 

గురుశ్రీ జోస్ ఫతేఘర్ చురియన్‌లోని సెయింట్ మేరీస్ దేవాలయ సహాయక గురువుగా తన పరిచర్యను ప్రారంభించారు, అదే సమయంలో అమృత్‌సర్‌లోని మైనర్ సెమినరీలో బోధించారు. ఆ తర్వాత ఆయన ఖాసాలోని సెయింట్ జోసెఫ్ చర్చి మరియు అమృత్‌సర్‌లోని మజితా రోడ్‌లోని సేక్రెడ్ హార్ట్ చర్చిలో విచారణ గురువుగా పనిచేశారు. 

ఆయన మైనర్ సెమినరీకి వైస్ రెక్టర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా మరియు తరువాత సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్‌కు ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు. 

 2007 నుండి 2020 వరకు మేత్రాసన ఛాన్సలర్ మరియు జ్యుడీషియల్ వికార్‌గా ఉన్నారు. ఆయన జలంధర్‌లోని హోలీ ట్రినిటీ రీజినల్ మేజర్ సెమినరీలో కూడా బోధించారు మరియు థియాలజీ విభాగానికి మరియు సెమినరీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పనిచేశారు.