కర్నూలు మేత్రాసనంలో కార్మెల్ మాత మహోత్సవము

కర్నూలు మేత్రాసనం, సుంకేశ్వరి, కార్మెల్ మాత దేవాలయంలో  జులై 16 ,2024 న కార్మెల్ మాత మహోత్సవము ఘనంగా జరిగింది.

ఆదోని డీన్ గురుశ్రీ కోలా విజయరాజు గారు 8 మంది గురువులుతో కలిసి పండుగ దివ్యబలి పూజను సమర్పించారు.

10 మంది మఠవాసులు, సుమారు 800 విశ్వాసులు ఈ మహోత్సవములో పాల్గొన్నారు 

విచారణ కర్తలు గురుశ్రీ థామస్ గారు విచ్చేసిన ఆదోని డీన్ గురుశ్రీ కోలా విజయరాజు గారికి, గురువులకు, మఠవాసులకు కృతజ్ఞతలు తెలియచేసారు.