ఇతరులపట్ల కరుణ కలిగి జీవించమన్న పోప్

మే 28 బుధవారం వాటికన్ లో జరిగిన సామాన్య ప్రేక్షకుల సమావేశంలో XIV లియో పోప్ ప్రసంగించారు.
మంచి సమరియుని వలె ప్రతి ఒక్కరూ పొరుగు వారి పట్ల దయ కలిగి జీవించాలని. కరుణ కలిగి జీవించడం అనేది మానవత్వానికి సంబంధించిన విషయమని అది మతపరమైన విషయం కాదని XIV లియో పోప్ అన్నారు.
ప్రతి క్రైస్తవుడు నిత్యజీవాన్ని పొందుకోవాలంటే తమ పొరుగువారి పట్ల ప్రేమ, దయ, కరుణ కలిగి జీవించాలని.
ప్రస్తుత ప్రపంచంలో పొరుగు వారి కష్టాలను, బాధలను పంచుకోకుండా స్వార్ధపు జీవితాన్ని జీవిస్తున్నారని అటువంటి జీవితాన్ని విస్మరించి అందరి పట్ల దయతో మెలగాలని ఆయన విశ్వ శ్రీసభను కోరారు.