ఆస్ట్రియాలోని పాఠశాల కాల్పుల బాధితుల కొరకు ప్రార్ధించిన పోప్

వాటికన్ లో బుధవారం జూన్ 11న జరిగిన సామాన్య ప్రేక్షకుల సమావేశంలో
పోప్ లియో ఆస్ట్రియాలోని గ్రాజ్లో జరిగిన పాఠశాల కాల్పుల బాధితులను జ్ఞాపకం చేసుకున్నారు.
తన ఆలోచనలు బాధితుల కుటుంబాలు మరణించిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులపై ఉన్నాయని వారి ఆత్మకు నిత్యా విశ్రాంతి ఆ దేవుడు దయచేయాలని పోప్ వేడుకున్నారు.
మంగళవారం జూన్ 10 న 21 ఏళ్ల డ్రీర్షుట్జెంగాస్సే ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి ఈ కాల్పులు జరిపాడు. ఒక వయోజనుడితో సహా 10 మంది మరణించగా, ఎంతో మంది గాయపడ్డారు.
ఆస్ట్రియా ఆధునిక చరిత్రలో ఇది అత్యంత దారుణమైన హింసాత్మక సంఘటన.
ఆ దేశ ఛాన్సలర్ Christian Stocker మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు , తమ దేశ చరిత్రలో ఇది ఒక చీకటి రోజు అని,ఊహించలేని హింస" మరియు "మనందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిన జాతీయ విషాదం" అని అభివర్ణించారు.
EU విదేశాంగ విధాన చీఫ్ కాజా కల్లాస్ ఈ కార్యక్రమంలో తన దిగ్భ్రాంతిని పంచుకున్నారు మరియు "ప్రతి బిడ్డ పాఠశాలలో సురక్షితంగా ఉండాలని మరియు భయం మరియు హింస నుండి విముక్తి పొందగలగాలి" అని పునరుద్ఘాటించారు.