“బాధలో ఉన్నవారి పక్షాన నిలవాలి”.. పోప్ లియో XIV

ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు, హింస, వివక్ష, పేదరికం, అన్యాయం వంటి సమస్యల పట్ల క్రైస్తవులు నిశ్చేష్ట ప్రేక్షకులుగా ఉండకూడదని పరిశుద్ధ లియో XIV పాపు గారు పిలుపునిచ్చారు.

“బాధలో ఉన్నవారి పక్షాన నిలవాలి”.. పోప్ లియో XIV 

ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు, హింస, వివక్ష, పేదరికం, అన్యాయం వంటి సమస్యల పట్ల క్రైస్తవులు నిశ్చేష్ట ప్రేక్షకులుగా ఉండకూడదని పరిశుద్ధ లియో XIV పాపు గారు పిలుపునిచ్చారు. బాధల్లో ఉన్న సోదర సోదరీమణుల బాధ్యతను పంచుకోవాలని ఆయన అన్నారు.

సెప్టెంబర్ 2, 2026న వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగిన సాధారణ ప్రేక్షకుల సమావేశంలో పరిశుద్ధ లియో XIV పాపు గారు ఇచ్చిన తాజా సందేశం ఇది. ఈ ప్రసంగం ఆయన కొనసాగిస్తున్న రెండో వాటికన్ కౌన్సిల్ (Vatican II) పత్రాలపై కాటెకెసిస్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసారు. ఈసారి ఆయన  “ఆనందం మరియు నిరీక్షణ”  పై దృష్టి పెట్టారు. 

పేదలు మరియు అత్యంత అవసరంలో ఉన్నవారిపై దృష్టి సారించడం, లేదా “పేదల పక్షాన నిలబడటం అనేది సాంస్కృతిక, సామాజిక, రాజకీయ లేదా తాత్విక అంశం కాకుండా, ప్రధానంగా దైవశాస్త్రపరమైన అంశం” అని పోప్ పేర్కొన్నారు.

“పేదలు, అణగారినవారిలో క్రీస్తును కనుగొనడానికి మనం పిలువబడ్డాం. వారి ఆశయాలు, హక్కులకు మన గొంతును వినిపించాలి. అంతేకాదు, వారికి స్నేహితులుగా ఉండాలి. వారి మాటలను శ్రద్ధగా వినాలి, వారి పక్షాన మాట్లాడాలి. వారి ద్వారా దేవుడు మనతో పంచుకోవాలనుకుంటున్న ఆ మర్మమైన జ్ఞానాన్ని స్వీకరించాలి” అని పోప్ లియో అన్నారు.

 

Article and Design By M Kranthi Swaroop

Telugu Survey Popup Image