సగ్రాడా ఫామిలియా బసిలికాలో దివ్యబలిపూజను సమార్పించిన పోప్
1926 జూన్ 10న, ట్రామ్ ఢీకొన్న మూడు రోజుల తర్వాత, బార్సిలోనాలో వాస్తుశిల్పి ఆంటోనీ గౌడీ మరణించారు.
వంద సంవత్సరాల తర్వాత, 2026 జూన్ 10న, పోప్ లియో ఆయన మరణ వార్షికోత్సవాన్ని స్మరించుకున్నారు.
ఆ స్పానిష్ వాస్తుశిల్పి యొక్క అత్యుత్తమ కళాఖండమైన 'సగ్రాడా ఫామిలియా' (Sagrada Família) బసిలికాలో పోప్ దివ్యబలిపూజను సమార్పించారు.
ఈ వేడుకలో ఐదు వేల మంది క్యాథలిక్ విశ్వాసులు పాల్గొన్నారు; వీరంతా పోప్ లియోతో కలిసి, నేడు "దేవుని వాస్తుశిల్పి"గా పిలువబడుతున్న ఆ మహనీయుని వారసత్వాన్ని స్మరించుకున్నారు.
విశ్వాసానికి అంకితమైన వాస్తుశిల్పిగా, గౌరవనీయులైన ఆంటోనీ గౌడీ ప్రభువు జీవితంలోని రహస్యాలను వివరించే ఉద్దేశంతో ఈ ప్రదేశాలను రూపొందించారు: తద్వారా మన కోసం జన్మించి, మరణించి, తిరిగి లేచిన క్రీస్తుతో సాక్షాత్కారానికి దారితీసే ఒక ఆధ్యాత్మిక యాత్రను ఆయన ప్రతిపాదించారు.
564 అడుగుల ఎత్తుతో నిర్మించిన, ఈ దేవాలయము ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా నిలిచింది.
మనం యేసును విశ్వసిస్తూనే యుద్ధాన్ని ప్రోత్సహించలేము, అమాయకులను చంపలేము,బాధపడేవారిని, రోదించేవారిని మరియు దుర్భర పరిస్థితుల నుండి పారిపోయే వారిని విస్మరించలేము.
వంద సంవత్సరాలు గడిచినా, సగ్రాడా ఫామిలియా నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు, అది కొనసాగుతూనే ఉంది. పోప్ లియో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, చర్చి నిర్మాణాన్ని క్రైస్తవ జీవితంతో పోల్చారు—అంటే, ఈ జీవితంలో ఎప్పటికీ సంపూర్ణం కాని, మరియు ప్రతి వ్యక్తి కోసం దేవుని సంకల్పాన్ని సూచించే ఒక ప్రయాణం అది.