దేవుడు మనల్ని ఎప్పటికీ విస్మరించడు - పోప్ లియో XIV

దేవుడు మనల్ని ఎప్పటికీ విస్మరించడు - పోప్ లియో XIV

ఆదివారంనాడు సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో పరిశుద్ధ పోప్ లియో XIV  గారు విశ్వాసులని  ఉద్దేశించి  ప్రసంగించారు.యేసు ప్రభువు వారు చెప్పిన మాటలపై ప్రతిబింబించాడు. జీవితంలోని కష్టాలు లేదా చీకటి రోజులు, ఆ తర్వాత వచ్చే ఆనందం యొక్క విలువను మరియు కాంతిని (మంచి రోజులను) మరింత ప్రకాశవంతంగా మరియు అర్ధవంతంగా మారుస్తాయని పరిశుద్ధ పోప్ లియో XIV గారు అన్నారు. యేసు ప్రభువు వారి వల్ల  దైనందిన జీవితంలో నిజమైన ఆనందం, రుచి మరియు వెలుగు ఎలా వస్తుందో పరిశుద్ధ పోప్ లియో XIV  గారు తెలియజేసారు.

 పరిశుద్ధ పోప్ లియో XIV గారు అన్యాయాన్ని అధిగమించడానికి నిర్దిష్ట మార్గాలను జాబితా చేశాడు  "ఆకలితో ఉన్నవారితో రొట్టె పంచుకోవడం, పేదలను మరియు నిరాశ్రయులను మన ఇళ్లలోకి తీసుకురావడం, మన పొరుగువారిని మరియు మన స్వంత ఇళ్లలో ఉన్నవారిని నిర్లక్ష్యం చేయకుండా చూడడం."  ప్రవక్త యెషయా  చెప్పినట్లుగా ,ఈవిధంగా చేయడం వల్ల “అప్పుడు మీ వెలుగు తెల్లవారుజాములాగా ఉదయిస్తుంది అని అన్నారు.

"రుచిని కోల్పోవడం మరియు ఆనందాన్ని వదులుకోవడం బాధాకరం," అని  పరిశుద్ధ పోప్ లియో XIV గారు పేర్కొన్నారు. రుచి కోల్పోయిన ఉప్పు  "ఇకపై దేనికీ పనికి రాదు అని కానీ బయటకు విసిరివేయబడి కాళ్ళ కింద తొక్కబడుతుంది" అని ఆయన చెప్పారు.

దేవుడు మనల్ని ఎప్పటికీ విసిరివేయడు. ఆయనకు మన పేర్లు కూడా తెలుసు అని పరిశుద్ధ పోప్ లియో XIV గారు అన్నారు. దేవుడు మన పట్ల ప్రత్యేకత పట్ల శ్రద్ధ వహిస్తాడు. " గాయపడ్డ ప్రతి హృదయం దేవుని  శుభవార్తల మాటను స్వాగతించడం ద్వారా మరియు సువార్త మార్గంలో మనల్ని తిరిగి ఉంచడం ద్వారా నయం అవుతుంది" అని పరిశుద్ధ పోప్ లియో XIV గారు నొక్కి చెప్పారు.

 

Article and design by 

M kranthi Swaroop