కామెరూన్లోని అనాథాశ్రమాన్ని సందర్శించిన పోప్
కామెరూన్లో తన అపోస్టోలిక పర్యటనలో మొదటి రోజైన ఏప్రిల్ 14 మంగళవారం నాడు, Ngul Zamba అనాథాశ్రమంలోని పిల్లలను మరియు సిబ్బందిని పోప్ లియో సందర్శించారు.
పోప్ మొదటిగా పిల్లలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, వారిని సందర్శించినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు మరియు ఈ అనాథాశ్రమం ఒక ప్రేమ నిలయంగా మారిందని వర్ణించారు.
కష్టతరమైన జీవితానుభవాలు ఉన్న పిల్లలు ఈ అనాథాశ్రమంలోని కుటుంబ వాతావర్ణంలో జీవిస్తున్నారు అని పోప్ అన్నారు
క్రీస్తు చుట్టూ చేరిన తోబుట్టువులుగా వారి ఐక్యత వారికి బలాన్ని ఇస్తుందని, జీవితంలోని కష్టాలను కలిసి ఎదుర్కొనేలా చేస్తుందని పోప్ జోడించారు.
ఎంతోమంది పిల్లలు ఎదుర్కొన్న నష్టం, విడిచిపెట్టబడటం మరియు అనిశ్చితి సవాళ్లను పోప్ గుర్తించారు. ఈ అనుభవాల ద్వారా వారి భవిష్యత్తును నిర్వచించుకోవద్దని పోప్ వారిని హెచ్చరించారు.
"మీ గాయాల కన్నా గొప్పదైన భవిష్యత్తుకు మీరు పిలువబడ్డారు," అని పోప్అన్నారు.
బాధలో ఉన్నవారికి దేవుడు దగ్గరగా ఉంటాడని, వారిలో ప్రతి ఒక్కరినీ ఆ ప్రభువు వ్యక్తిగతంగా ఎరుగునని పోప్ వారికి గుర్తు చేశారు.
ఆ తర్వాత సువార్త పఠనం ధ్యానాంశాన్ని వివరిస్తూ "యేసు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారని పోప్ లియో గుర్తు చేశారు. క్రీస్తు ఈ రోజు కూడా వారిని అదే శ్రద్ధతో, ఆప్యాయతతో చూస్తున్నారని పోప్ పిల్లలతో చెప్పారు.
అనంతరం పోప్ లియో సమాజం విస్తృత బాధ్యత గురించి కూడా మాట్లాడారు.
ఉదాసీనతతో నిండి ఉండే ఈ ప్రపంచంలో, అనాథాశ్రమాల వంటి ప్రదేశాలు ప్రజలు ఒకరినొకరు ఆదుకోవలసిన బాధ్యతను గుర్తుచేస్తాయి.
"దేవుని గొప్ప కుటుంబంలో ఎవరూ పరాయివారు కాదు, ఎవరూ విస్మరించబడినవారు కారు," అని పోప్అన్నారు.
అనాథాశ్రమంలో పిల్లలను చూసుకుంటున్న సిబ్బందికి, వాలంటీర్లకు, మఠకన్యలకు ధన్యవాదాలు తెలిపి, వారి నిబద్ధతను, అంకితభావాన్ని పోప్ ప్రశంసించారు.