6వ ప్రపంచ తాతామామల దినోత్సవ ఇతివృత్తాన్ని ప్రకటించిన పోప్
ఆరవ ప్రపంచ తాతామామల మరియు వృద్ధుల దినోత్సవానికి ఇతివృత్తాన్ని పోప్ లియో ప్రకటించినట్లు వాటికన్ దైవప్రజల, కుటుంబం విభాగం వారు ఒక ప్రకటనలో తెలిపారు.
యెషయా గ్రంధం 49:15 వ్రాయబడినట్లు " నేను నిన్ను మరువను" అనే ఇతివృత్తాన్ని పోప్ ఎంచుకున్నారు
దివంగత పోప్ ఫ్రాన్సిస్ ఈ ప్రపంచ తాతామామల మరియు వృద్ధుల దినోత్సవాన్ని
2021 లో స్థాపించారు. ప్రతి ఏటా జూలై నాల్గవ ఆదివారం దీనిని జరుపుకుంటారు.
వృద్ధులకు మరియు తమ ప్రాంతీయ శ్రీసభ మధ్య సాన్నిహిత్యాన్ని తీసుకురావడానికి, కుటుంబాలకు, సమాజాలకు వారి సహకారాన్ని పెంపొందించేందుకు ఒక అవకాశంగా దీనిని స్థాపించారు.
ఈ సంవత్సరం, జూలై 26 ఆదివారం పునీత జ్వాకీము అన్నమ్మల పండుగ రోజున దీనిని ప్రతి మేత్రాసన కథడ్రల్ జరుపుకోవాలని పోప్ పిలుపునిచ్చారు.
ఈ ఇతివృత్తం వృద్ధులకు, ముఖ్యంగా ఒంటరితనంలో నివసించే లేదా మరచిపోయినట్లు భావించే వారికి ఓదార్పు మరియు నిరీక్షణ సందేశంగా ఎంచుకోబడింది.