రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ మరియు ఫుట్ బాల్ జట్టుకు ఎన్నికైన "శాంతి సాధన పాఠశాల " విద్యార్థులు

రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ మరియు ఫుట్ బాల్ జట్టుకు ఎన్నికైన "శాంతి సాధన పాఠశాల " విద్యార్థులు
 
విశాఖ అతిమేత్రాసనం , గూడెంకొత్తవీధి మండలం ఆర్వీనగర్లోని "శాంతి సాధన పాఠశాల " విద్యార్థులు రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ మరియు ఫుట్ బాల్ జట్టుకు ఎన్నికయ్యారు.
ఈ సందర్భముగా శాంతి సాధన పాఠశాల కరస్పాండెంట్ గురుశ్రీ  హ్యారి ఫిలిప్స్, ప్రిన్సిపాల్ సిస్టర్  భాగ్యమేరీ,PT మాస్టర్ తిమోతి గారు  పిల్లలను అభినందించారు. బాలికలు హ్యాండ్ బాల్ కు బాలురు హ్యాండ్ బాల్ మరియు ఫుట్ బాల్ రాష్ట్ర జట్టుకు ఎన్నికయ్యారు.ఎన్నికైన నలుగురు బాలికలు ధనలక్ష్మి, చంద్రజ , యోగబలా మరియు భాగ్యశ్రీ లలో  ధనలక్ష్మి, చంద్రజ లు నేషనల్ జట్టుకు ఎన్నికయ్యారు.  
గురుశ్రీ  హ్యారి ఫిలిప్స్ గారు మాట్లాడుతూ  విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. రాష్ట్ర మరియు జాతీయ స్థాయి పోటీల్లో కూడా పతకాలను సాధించాలని ఆశీర్వదించారు.
గురుశ్రీ  హ్యారి ఫిలిప్స్, ప్రిన్సిపాల్ సిస్టర్  భాగ్యమేరీలు  విద్యార్థుల కొరకు   "ఫాదర్ సి జి జోసెఫ్ మెమోరియల్ హ్యాండ్ బాల్ కోర్ట్" ను ఏప్రిల్ నెలలో ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రోత్సహించారు.