“అస్సాం వరదల్లో క్రీస్తు ప్రేమకు సాక్ష్యంగా సిస్టర్ల సేవ”
“అస్సాం వరదల్లో క్రీస్తు ప్రేమకు సాక్ష్యంగా సిస్టర్ల సేవ”
సిస్టర్లను ఎంతగా నిందించినా… ఎంతగా ఎగతాళి చేసినా…
ఇతరులకు సహాయం చేయకుండా వారిని ఎవ్వరూ ఆపలేరు.
ఎందుకంటే వారి హృదయ లోతుల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన క్షమాగుణం, ప్రేమ నిండివున్నాయి.
ఆ ప్రేమే వారికి బాధలో ఉన్నవారి వైపు అడుగులు వేయడానికి బలాన్నిస్తుంది.
ఆ క్షమాగుణమే వారిని ప్రతిఫలం ఆశించకుండా మానవతా సేవ చేయడానికి పురికొల్పుతుంది.
“వరద నీటితో అస్సాంలో ప్రజల జీవనం మరోసారి అస్తవ్యస్తమైంది. వేలాది మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, సహాయక చర్యలను అధికారులు కొనసాగిస్తున్నారు. బాధిత ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.”
అస్సాంలో కొత్తగా వరదలు విరుచుకుపడుతున్న నేపథ్యంలో దిబ్రుగఢ్ కాథలిక్ డియోసెస్ సిస్టర్స్ ప్రజల సహాయార్థం ముందుకు వచ్చారు. వరద నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను పరామర్శిస్తూ,వారికి అవసరమైన సహాయాన్ని సిస్టర్స్ అందిస్తున్నారు.ఆహారం, తాగునీరు, నిత్యావసర వస్తువులు వంటి సహాయక సామగ్రిని అందించడంతో పాటు, కష్టాల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెబుతూ, వారి బాధలను పంచుకున్నారు.
సెప్టెంబర్ 3న విడుదలైన తాజా అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) సమాచారం ప్రకారం 7 జిల్లాలు ప్రస్తుతం వరద ప్రభావంలో ఉన్నాయి. అవి గోల్పారా, శివసాగర్, బిశ్వనాథ్, నాగావ్, మొరిగావ్, వెస్ట్ కర్బీ ఆంగ్లాంగ్, కచార్.25,083 మంది ప్రజలు ప్రభావితమయ్యారు.155 గ్రామాలు వరదలకు ప్రభావితమయ్యాయి.
Article and Design By M Kranthi Swaroop
