హంగరీ బస్సు ప్రమాదం.. బాధిత కుటుంబాలకు పోప్ లియో ఓదార్పు
హంగరీ బస్సు ప్రమాదం.. బాధిత కుటుంబాలకు పోప్ లియో ఓదార్పు
హంగరీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన 12 మంది పోలిష్ యాత్రికుల కుటుంబాలకు పరిశుద్ధ లియో XIV పాపు గారు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మృతుల ఆత్మశాంతి కోసం, వారి కుటుంబాలకు దేవుని ఓదార్పు కలగాలని ప్రార్థనలు చేశారు.
ఆగస్టు 16న బుడాపెస్ట్కు తూర్పున సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న హంగేరిలోని మెజోకెరెస్టెస్ ప్రాంతంలో, M3 హైవేపై ఈ ప్రమాదం జరిగింది. మెడ్జుగోర్జేలోని మరియతల్లి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి పోలాండ్కు తిరిగి వెళ్తున్న 57 మంది యాత్రికులతో కూడిన బస్సు అదుపుతప్పి రహదారి పక్కనున్న గుంటలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు.
ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
పరిశుద్ధ లియో XIV పాపు గారి తరఫున మహా పూజ్య కార్డినల్ పియెట్రో పరొలిన్ గారు పోలాండ్కు చెందిన సంబంధిత పీఠాధిపతు (బిషప్)లకు సంతాప సందేశాన్ని పంపారు.పోలాండ్ మరియు హంగేరి బిషప్ల సమావేశాలు కూడా బాధితులకు, గాయపడిన వారికి తమ సంతాపం తెలిపి, వారి కోసం ప్రార్థనలు సమర్పించాయి.విశ్వాస
యాత్ర నుంచి తిరిగి వస్తూ తమ భౌతిక ప్రయాణాన్ని ముగించిన ఈ యాత్రికుల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నట్లు పరిశుద్ధ లియో XIV పాపు గారు తెలిపారు.
Article and Design By M Kranthi Swaroop
