సిరియా చర్చిలో ఆత్మాహుతి దాడి

సిరియా చర్చిలో ఆత్మాహుతి దాడి 

సిరియా రాజధాని  డమాస్కస్‌( Damascus ), సెయింట్ ఎలిజా గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చిలో సోమవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారని సమాచారం.ఈ బాంబు దాడిలో మరో 52 మంది గాయపడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

డమాస్కస్‌కు తూర్పు శివార్లలోని క్రైస్తవులు అధికంగా నివసించే ద్వెయిలా జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. దాడి చేసిన వ్యక్తి మొదట చర్చిలో ప్రార్థనలు చేస్తున్న వారిపై కాల్పులు జరిపి, ఆ తర్వాత తనను తాను పేల్చుకున్నాడు.ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థకు చెందినవాడని అంతర్గత భద్రతా విభాగం అధికారులు ధ్రువీకరించారు.అయితే ఈ దాడికి ఏ గ్రూపు ఇంకా బాధ్యత వహించలేదు.

దాడి చేసిన వ్యక్తి చర్చిలోకి గ్రెనేడ్ కూడా విసిరాడని ఆంటియోక్ మరియు ఆల్ ది ఈస్ట్ గ్రీక్ ఆర్థోడాక్స్ పాట్రియార్కేట్ సహాయ  బిషప్ మోయిసెస్ మౌసా ఎల్ ఖౌరీ తెలిపారు.

Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer

 

 

Telugu Survey Popup Image