భక్తిశ్రద్ధలతో పెంతుకోస్తు ఆదివారం

భక్తిశ్రద్ధలతో పెంతుకోస్తు ఆదివారం

విశాఖ అగ్రపీఠం, జ్ఞానాపురం లోని   పునీత పేతురు ప్రధాన దేవాలయంలో 
పెంతుకోస్తు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరిగింది.ఈ కార్యక్రమం జ్ఞానాపురం విచారణ కర్తలు ఫాదర్ జాన్ ప్రకాశ్ గారి ఆధ్వర్యంలో జరిగింది.

పెంతుకోస్తు ఆదివారం సందర్భముగా  ప్రత్యేక ఆరాధన మరియు 'భద్రమైన అభ్యంగము మరియు పవిత్రాత్మ స్వీకరణ మహోత్సవము (The Confirmation Day) ను ఘనంగా నిర్వహించారు. 

ఈ వేడుకలో విశాఖ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య బాలశౌరి గారు పాల్గొన్నారు. ఇతర గురువులతో కలసి  దివ్యబలి పూజను సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. విచారణ గాయకబృదం మధురమైన గీతాలను ఆలపించారు.  
 
ఈ సందర్భముగా దాదాపు 60 మంది పిల్లలు మరియు పెద్దలు  'భద్రమైన అభ్యంగము' స్వీకరించారు.  ఈ కార్యక్రమంలో  ఫాదర్  వినయ్ కుమార్, ఫాదర్  అంథోనీ రాజు, ఏ ఐ సి యు జాతీయ కార్యదర్శి శ్రీ BVR శేషుబాబు గారు, జ్ఞానోపదేశ ఉపాధ్యాయులు ( Catechism teachers), పి పి సి కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సహాయ సహకారాలను అందించారు. 

Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer