ఘనంగా యువతా సదస్సులు

ఘనంగా యువతా సదస్సులు
విశాఖ అతిమేత్రాసనం, క్రీస్తురాజు పుణ్యక్షేత్రం, ఎర్ర సామంత వలస గిరిజన విచారణలో మే 20,21 తేదీలలో యువతా సదస్సులు ఘనంగా జరిగాయి. యర్రసామంతవలస విచారణ కర్తలు ఫాదర్ పి. జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
మొదటిరోజు " నిరీక్షణ యాత్ర – యువత పాత్ర " అనే అంశాలతో కూడిన ప్రసంగాలు , క్విజ్ ఆలోచింపజేసే వ్యాఖ్యానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అధికసంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.
రెండవరోజు ముగింపు వేడుకలకు విశాఖ అగ్ర పీఠాధిపతులు మహా పూజ్య ఉడుమల బాల గారు పాల్గొన్నారు. గిరిజన విశ్వాసులు తమ సాంప్రదాయ నృత్యం థింసా తో మహా పూజ్య ఉడుమల బాల గారికి స్వాగతం పలికారు. మహా పూజ్య ఉడుమల బాల గారు ఇతర గురువులతో కలసి దివ్య బలిపూజను సమర్పించారు. అమూల్యమైన దైవ సందేశాన్ని అందించారు. ఈ సందర్భముగా 73 మంది చిన్నారులకు నూతన దివ్య సత్ప్రసాదము స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఫాదర్ డి జయరాజు, ఫాదర్ ప్రేమ్, ఫాదర్ యేసు రత్నం, ఫాదర్ మరియ దాసు గార్ల పాల్గొని తమ సహాయ సహకారాలను అందించారు. ఆద్యంతం భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం జరిగింది.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer