భక్తియుతంగా పాప పశ్చాత్తాప పాద యాత్ర

భక్తియుతంగా  పాప పశ్చాత్తాప పాద యాత్ర

విశాఖ అతిమేత్రాసనం వేళాంగణి  మాత దేవాలయం, కైలాసపురం విచారణలో పాప పశ్చాత్తాప పాద యాత్ర" భక్తియుతంగా జరిగింది.  శనివారం ఉ|| 5 గం||లకు వేళాంగణి మాత దేవాలయం నుండి  మేరీమాత కొండ గుడి వరకు ఈ పాప పశ్చాత్తాప పాద యాత్ర నిర్వహించారు.  

విచారణ కర్తలు  గురుశ్రీ సంతోష్ CMF, మరియు సహాయక గురువులు గురుశ్రీ జాన్ CMF ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. యువతీయువకులు తమ సహాయ సహకారాలను అందించారు.

గురుశ్రీ సంతోష్ గారు విశ్వాసులు  ఆధ్యాత్మికంగా ముందుకు నడిచేలా  వారి కొరకు ప్రత్యక   కార్యక్రమాలను ఏర్పాటు చేసారు.   

తపస్సుకాలములో సోమవారము నుండి గురువారము వరకు ఉదయం 7 గం||లకు దివ్యబలిపూజ, తరువాత పరిశుద్ద సిలువ మార్గం నిర్వహిస్తున్నారు. శుక్రవారం  సాయంకాలం 6 గం||లకు పరిశుద్ధ సిలువ మార్గం, అనంతరం  దివ్యబలిపూజ నిర్వహిస్తున్నారు. శనివారం  సాయంకాలం 5.30 గం॥లకు పరిశుద్ద సిలువ మార్గం, తరువాత దివ్యబలిపూజ, వేళాంగణి మాత నవదిన ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. ఆదివారం  ఉదయం 7.30 గం|| లకు పరిశుద్ద సిలువ మార్గం తరువాత దివ్యబలిపూజ నిర్వహించునున్నట్లు గురుశ్రీ సంతోష్ గారు తెలిపారు.

కైలాసపురం విచారణలో జరుగు ఈ తపస్సు కాలపు పాప పరిహార పశ్చాత్తాప ఉపవాస ప్రార్థనా కూడికలో విశ్వాసులందరు  తప్పకుండ పాల్గొని మంచి పాపసంకీర్తనం చేసి ఈస్టర్ పండుగను కొనియాడాలని గురుశ్రీ సంతోష్ గారు విశ్వాసులను కోరారు.

విచారణ ప్రజలను ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్న గురుశ్రీ సంతోష్ గారిని ఆ దేవాది దేవుడు దీవించాలని కోరుకుంటూ మీ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer