నిరుద్యోగుల ఉపాధి కల్పనకు జాబ్ మేళా : బిషప్ ప్రకాశ్

నిరుద్యోగుల ఉపాధి కల్పనకు జాబ్ మేళా : బిషప్ ప్రకాశ్

ఖమ్మం మేత్రాసనం, తల్లాడ మండలం, రెడ్డిగూడెం క్రీస్తుజ్యోతి జూనియర్ కళాశాలలో శుక్రవారం నాడు జాబ్ మేళా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఖమ్మం మేత్రాసన పీఠకాపరి మహా పూజ్య ప్రకాశ్ గారు పాల్గొన్నారు.  మహా పూజ్య ప్రకాశ్ గారు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యువతకు అపారమైన అవకాశాలు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదని మహా పూజ్య ప్రకాశ్ గారు  ఆవేదన వ్యక్తంచేశారు. 

సుమారు 1,700 మంది నిరుద్యో గులు హాజరయ్యారని, హైదరాబాద్ నుంచి 25 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని వెల్లడించారు. 1,200 మందిని ఎంపిక చేసి 800 మందికి నియామక పత్రాలందించారు. 

ఈ సందర్భముగా యువతకు ఉపాధి కల్పించేందుకు బాధ్యత తీసుకున్న డాన్ బాస్కో, దిశా సంస్థలను స్వచ్చందంగా పాల్గొని వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన కంపెనీలను మహా పూజ్య ప్రకాశ్ గారు అభినందించారు. 

జాబ్ మేళా నిర్వాహకులు ఫాదర్ జస్టిన్, క్రీస్తు జ్యోతి కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ కొరివి థామస్ ను బిషప్ తో పాటు పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో సోషల్ సర్వీస్ డైరెక్టర్ ఫాదర్  సురేష్,  ఫాదర్ విజయ్, పెద్ద గోపతి విచారణ కర్తలు ఫాదర్ రమేష్, తల్లాడ విచారణ కర్తలు ఫాదర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer