"ది రూట్స్ అఫ్ తెలుగు క్రిస్టియన్ కీర్తనాస్"-పుస్తక ఆవిష్కరణ

జూలై 31,2024  న పునీత లయోలా ఇన్యాసివారి పండుగ సందర్బంగా  హైదరాబాద్ అగ్రపీఠం, సికింద్రాబాద్ సెయింట్ పాట్రిక్స్ హై స్కూల్ నందు ప్రార్ధనా కూడికను ఏర్పాటుచేశారు,

దీనిలో హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్న గురువులు, మఠవాసులు, గురువిద్యార్థులు పాల్గొన్నారు. గురుశ్రీ రవిశేఖర్ గారిచే ఒక గంటసేపు ప్రార్ధనా అనంతరం హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహా పూజ్య పూల అంతోని గారు పునీత ఇన్యాసి వారి గురించి మాట్లాడారు.

"ది రూట్స్ అఫ్ తెలుగు క్రిస్టియన్ కీర్తనాస్" అనే పుస్తకాన్ని హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహా పూజ్య పూల అంతోని గారు ఆవిష్కరించగా, జేసుసభ ప్రొవిన్సియల్ గురుశ్రీ కే స్టానిస్లాస్ SJ, మాజీ ప్రొవిన్సియల్ గురుశ్రీ శాంటియాగో, గురుశ్రీ స్వర్ణ బెర్నార్డ్ మరియు గురుశ్రీ  పకాయ్ రాజ్ గార్లకు దీనిని అందచేశారు 

ఈ పుస్తకాన్ని జేసుసభకు చెందిన గురుశ్రీ దూసి రవి శేఖరం గారు రచించారు.