కృత్రిమ మేధస్సుపై శిఖరాగ్ర సమావేశానికి సందేశాన్ని పంపిన పొప్ ఫ్రాన్సిస్
![](/sites/default/files/styles/max_width_770px/public/2025-02/v8_6_0.png?itok=yhgRsHlp)
2025 ఫిబ్రవరి 10-11 తేదీలలో పారిస్లో జరిగిన Artificial Intelligence Action Summit సందర్భంగా మంగళవారం ఫిబ్రవరి 11 ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్కు పొప్ ఫ్రాన్సిస్ సందేశాన్ని పంపారు
కృత్రిమ మేధస్సు మరియు దాని సామర్థ్యం పట్ల తన ప్రశంసలను వ్యక్తం చేస్తూ, AI కి సరైన మానవ పర్యవేక్షణ లేకపోతే, "మానవ గౌరవానికి ముప్పు కలిగిస్తుందని పొప్ అన్నారు.
"ఈ భూమిపై పర్యావరణ-సుస్థిరతను ప్రోత్సహించే వినూత్న మరియు సృజనాత్మక పరిష్కారాలను కనుగొనడంలో సహకరించే శాస్త్రవేత్తలు మరియు నిపుణుల చేతుల్లో కృత్రిమ మేధస్సు శక్తివంతమైన సాధనంగా మారగలదని" పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.
అయితే, "కృత్రిమ మేధస్సు మౌలిక సదుపాయాల నిర్వహణతో ముడిపడి ఉన్న అధిక శక్తి వినియోగాన్ని విస్మరించకూడదు" అని ఆయన హెచ్చరించారు.
"పేదలు, శక్తిహీనులు మరియు ప్రపంచ నిర్ణయాత్మక ప్రక్రియలలో కృత్రిమ మేధస్సు నియంత్రణ గురించి ఏవైనా చర్చలలో వాటాదారుల సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు.