అశ్రునివాళి

హైదరాబాద్, JMJ సభకు చెందిన సిస్టర్ ఎలీనోరా చేవ గారు 6 జనవరి 2024న శాంతినికేతన్ JMJ వృద్ధుల నివాసం, సనత్‌నగర్ నందు మరణించారు.

తను 28 జనవరి, 1936లో జన్మించారు. హైదరాబాద్ JMJ ప్రావిన్స్‌కు చెందినవారు

వీరి అంత్యక్రియలు, హైదరాబాద్ అగ్రపీఠం,మెట్టిగుడా కథోలిక శ్మశాన వాటిక నందు 7 జనవరి 2024న, ఉదయం 11:30 గంటలకు దివ్యపూజాబలి అనంతరం జరుపబడును అని సిస్టర్ ముక్తా గారు తెలిపారు.

వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తూ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం తరుపున అశ్రునివాళి.